మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- December 08, 2025
మస్కట్: మస్కట్ లో "యువర్ అవేర్ నెస్, యువర్ సేఫ్టీ " అనే నినాదంతో వాతావరణ మరియు సునామీ ప్రమాదాలపై జాతీయ అవగాహన క్యాంపెయిన్ మస్కట్ లో నిర్వహించనున్నారు. ఇది మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా తుఫానులు మరియు సునామీల వల్ల కలిగే ప్రమాదాలను ఎదుర్కోవడానికి జాతీయ సంసిద్ధతపై అవగాహన కల్పించనున్నారు.
జాతీయ అత్యవసర నిర్వహణ కేంద్రం, పౌర విమానయాన అథారిటీ, సమాచార మంత్రిత్వ శాఖ మరియు పౌర రక్షణ అంబులెన్స్ అథారిటీ నేతృత్వంలో ఈ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, సునామీలతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన పెంచడం ఈ క్యాంపెయిన్ ప్రాథమిక లక్ష్యమన్నారు. మస్కట్లో జరిగే మూడు రోజుల కార్యక్రమంలో సమావేశాలు, సెమినార్లు నిర్వహించడంతోపాటు ప్రత్యేక అవగాహన మెటీరియల్ ను పంపిణీ చేయనున్నారు.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









