బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- December 08, 2025
మనమా: బహ్రెయిన్, యూఏఈ లక్ష్యంగా ఇరాన్ చేసిన కామెంట్స్ పై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ వైఖరిని తప్పుబట్టారు. జిసిసి సభ్య దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే విధంగా ప్రకటనలు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రకటనలు తప్పుడు వాదనలు లేదా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు.
ముఖ్యంగా, ఇరాన్ వ్యాఖ్యలు బహ్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రస్తుతం ఇరాన్ నియంత్రణలో ఉన్న మూడు దీవులు టర్ తున్బ్, లెస్సర్ తున్బ్ మరియు అబు ముసా లపై యూఏఈ చట్టబద్ధమైన హక్కులకు విఘాతం కలిగేలా ఉన్నాయని తెలిపారు. కువైట్ మరియు సౌదీ అరేబియా సంయుక్త యాజమాన్యంలోని అల్-దుర్రా ఆఫ్షోర్ ఆయిల్ క్షేత్రంపై సార్వభౌమ హక్కులను తగ్గించాయని అల్బుదైవి మండిపడ్డారు.
ఇరాన్ ప్రకటనలు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించాయని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య దూరం పెంచే ఇలాంటి ప్రకటనలను జారీ చేయడం వెంటనే నిలిపివేయాలని పులుపునిచ్చారు.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









