బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- December 08, 2025
మనమా: బహ్రెయిన్, యూఏఈ లక్ష్యంగా ఇరాన్ చేసిన కామెంట్స్ పై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ వైఖరిని తప్పుబట్టారు. జిసిసి సభ్య దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే విధంగా ప్రకటనలు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రకటనలు తప్పుడు వాదనలు లేదా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు.
ముఖ్యంగా, ఇరాన్ వ్యాఖ్యలు బహ్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రస్తుతం ఇరాన్ నియంత్రణలో ఉన్న మూడు దీవులు టర్ తున్బ్, లెస్సర్ తున్బ్ మరియు అబు ముసా లపై యూఏఈ చట్టబద్ధమైన హక్కులకు విఘాతం కలిగేలా ఉన్నాయని తెలిపారు. కువైట్ మరియు సౌదీ అరేబియా సంయుక్త యాజమాన్యంలోని అల్-దుర్రా ఆఫ్షోర్ ఆయిల్ క్షేత్రంపై సార్వభౌమ హక్కులను తగ్గించాయని అల్బుదైవి మండిపడ్డారు.
ఇరాన్ ప్రకటనలు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించాయని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య దూరం పెంచే ఇలాంటి ప్రకటనలను జారీ చేయడం వెంటనే నిలిపివేయాలని పులుపునిచ్చారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









