బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- December 08, 2025
మనమా: బహ్రెయిన్, యూఏఈ లక్ష్యంగా ఇరాన్ చేసిన కామెంట్స్ పై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ వైఖరిని తప్పుబట్టారు. జిసిసి సభ్య దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే విధంగా ప్రకటనలు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రకటనలు తప్పుడు వాదనలు లేదా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు.
ముఖ్యంగా, ఇరాన్ వ్యాఖ్యలు బహ్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రస్తుతం ఇరాన్ నియంత్రణలో ఉన్న మూడు దీవులు టర్ తున్బ్, లెస్సర్ తున్బ్ మరియు అబు ముసా లపై యూఏఈ చట్టబద్ధమైన హక్కులకు విఘాతం కలిగేలా ఉన్నాయని తెలిపారు. కువైట్ మరియు సౌదీ అరేబియా సంయుక్త యాజమాన్యంలోని అల్-దుర్రా ఆఫ్షోర్ ఆయిల్ క్షేత్రంపై సార్వభౌమ హక్కులను తగ్గించాయని అల్బుదైవి మండిపడ్డారు.
ఇరాన్ ప్రకటనలు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించాయని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య దూరం పెంచే ఇలాంటి ప్రకటనలను జారీ చేయడం వెంటనే నిలిపివేయాలని పులుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







