తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- December 08, 2025
అమరావతి: తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కఠినంగా స్పందించారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిని తెలుసుకోవడానికి ఆమె తిరుపతి ఎస్పీ మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించారు. నిందితులపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
ఫిర్యాదు అందగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని హోంమంత్రి పేర్కొన్నారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో సాక్ష్యాలు, కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఒడిశాకు పంపినట్లు వెల్లడించారు.
మహిళల భద్రతపై రాష్ట్ర హోంమంత్రి హై అలర్ట్
మంత్రిత్వంలో అనిత, బాధితురాలికి న్యాయం కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పునరుద్ఘాటించారు. మహిళల భద్రత ప్రభుత్వానికి ప్రాధాన్యత ఉన్నదని, ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ మన్నించరని ఆమె హెచ్చరించారు. పోలీసులు వేగవంతమైన దర్యాప్తు నిర్వహించి, బాధితురాలకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని హోంమంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









