భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- December 09, 2025
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది. అమోరి, హొక్కైడో తీరంలో భూకంపం వచ్చింది. సముద్ర ఉపరితలం నుంచి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ భారీ భూకంపం కారణంగా ప్రమాదకరమైన సునామీ తరంగాలు జపాన్, రష్యా తీరాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. భూకంప కేంద్రం నుంచి వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా విధ్వంసకర అలలు వచ్చే ప్రమాదం ఉందంది. హొక్కైడోకు చెందిన ఒక వ్యక్తి ఈ భారీ భూకంపం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
భూకంపం వచ్చిన కాసేపటికే హొక్కైడోలోని ఉరకావా, అమోరిలోని ముత్సు ఒగవారా తీరాల్లో 40 సెంటీమీటర్ల మేర సునామీ అలలు తాకినట్లు అధికారులు వెల్లడించారు. భారీ భూకంపం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాల్లో తలదాచుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.
కాగా, ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న ఈ ప్రాంతంలో భూమి టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొంటాయి. దీంతో ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయని పరిశోధకులు తెలిపారు. మార్చి 2011లో ఇదే ప్రాంతంలో భారీ భూకంపం, సునామీ సంభవించి వేలాది మంది మరణించారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









