‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- December 09, 2025
హైదరాబాద్: సినీ గీతాలలో రాగాల విశేషాలను తెలుసుకోవాలంటే మంచి పుస్తకాలు చదవడం ఎంతో అవసరమని ప్రముఖ గాయని ఎస్.పి.శైలజ అన్నారు. శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై వంశీ ఇంటర్నేషనల్, శ్రీకృష్ణ స్వర రాగ స్రవంతి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రూపాకుల మహేశ్వరీ రచించిన ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శైలజ సంపుటిని ఆవిష్కరించి మాట్లాడుతూ,
“మంచి పుస్తకం ఉత్తమ నేస్తం. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విషయ పరిజ్ఞానం కోసం మంచి పుస్తకాలు చదవడం అవసరం. అలాంటి విలువైన గ్రంథమే ‘ఏక రాగం దశ సినీ గీతాలు’. ప్రతి గ్రంథాలయం, సంగీత శిక్షణా సంస్థలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి” అని సూచించారు.
అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం మాట్లాడుతూ,
“శాస్త్రీయ సంగీతం సప్త స్వరాల ఆధారంగా నిర్మితమై ఉంటుంది. వాటిని అన్వయిస్తూ సినీ గీతాలలో రాగ విశ్లేషణను మహేశ్వరీ తన సంపుటిలో అద్భుతంగా వివరించారు” అని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ప్రచురణకర్త వల్లభిజ్యులు, గాయని అమాంతలను సంఘం తరఫున సత్కరించారు.కార్యక్రమాన్ని వంశీ రామరాజు సమర్థంగా నిర్వహించారు. సినీ సంగీత దర్శకుడు సురేష్ రాష్ట్రపతి,ఎస్టేట్ మేనేజర్ రజినీ ప్రియ, గాయని సురేఖ, సంఖ్యా శాస్త్రవేత్త దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు వై.ఎస్. రామకృష్ణ లలిత బృందం, సుంకరపల్లి శైలజ నిర్వహణలో పలు సినీ పాటలను సుందరంగా ఆలపించి కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూర్చారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







