భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- December 13, 2025
న్యూ ఢిల్లీ: భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.ఈ టారిఫ్లు చట్టబద్ధం కావని, భారత్తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు హానికరమని పేర్కొంటూ అమెరికా ప్రతినిధుల సభలో సభ్యులు కీలక తీర్మానం ప్రవేశపెట్టారు.
ప్రతినిధుల సభ సభ్యులు డెబోరా రాస్, మార్క్ విసీ, రాజా కృష్ణమూర్తి కలిసి భారత్పై విధించిన 50% టారిఫ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని వారు విమర్శించారు.
ఈ టారిఫ్ల వల్ల భారత్–అమెరికా మధ్య ఉన్న వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలకు తీవ్ర దెబ్బ తగులుతుందని అమెరికా చట్టసభ సభ్యులు హెచ్చరించారు. ఇలాంటి నిర్ణయాలు రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, దీర్ఘకాలంలో అమెరికాకే నష్టమని వారు అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అంశం కూడా అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు ట్రంప్ పాలనకు అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.భారత్పై టారిఫ్లు, రష్యా–భారత్ సన్నిహితత వంటి అంశాలు కలిసి ట్రంప్కు రాజకీయంగా ఎదురుదెబ్బగా మారుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ తన వాణిజ్య విధానాలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









