భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- December 13, 2025
న్యూ ఢిల్లీ: భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.ఈ టారిఫ్లు చట్టబద్ధం కావని, భారత్తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు హానికరమని పేర్కొంటూ అమెరికా ప్రతినిధుల సభలో సభ్యులు కీలక తీర్మానం ప్రవేశపెట్టారు.
ప్రతినిధుల సభ సభ్యులు డెబోరా రాస్, మార్క్ విసీ, రాజా కృష్ణమూర్తి కలిసి భారత్పై విధించిన 50% టారిఫ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని వారు విమర్శించారు.
ఈ టారిఫ్ల వల్ల భారత్–అమెరికా మధ్య ఉన్న వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలకు తీవ్ర దెబ్బ తగులుతుందని అమెరికా చట్టసభ సభ్యులు హెచ్చరించారు. ఇలాంటి నిర్ణయాలు రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, దీర్ఘకాలంలో అమెరికాకే నష్టమని వారు అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అంశం కూడా అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు ట్రంప్ పాలనకు అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.భారత్పై టారిఫ్లు, రష్యా–భారత్ సన్నిహితత వంటి అంశాలు కలిసి ట్రంప్కు రాజకీయంగా ఎదురుదెబ్బగా మారుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ తన వాణిజ్య విధానాలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









