డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- December 13, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, ప్రతీ నెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకటో తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తోంది. ఈ పెన్షన్ల పంపిణీ గతంలో వాలంటీర్ల ద్వారా జరుగుతుండగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, సచివాలయ ఉద్యోగుల చేతుల్లో అప్పగించింది. జనవరి నెలలో, కొత్త ఏడాది వేడుకలు జరగనున్న నేపథ్యంలో, గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2026 లో వచ్చే జనవరి 1వ తేదీ, కొత్త సంవత్సరమైనందున, జనవరి 31వ తేదీన ఈ పెన్షన్ల పంపిణీ చేయాలని వారు అభ్యర్థించారు.
మరిన్ని పెన్షన్ల పంపిణీని జనవరి 2వ తేదీకి షెడ్యూల్ చేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సూచిస్తున్నారు.ఇందుకు తోడు, గత ఏడాది కూడా ప్రభుత్వం డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీని ముందుగా ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ సంవత్సరం కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో, ఒకటో తేదీ పెన్షన్ల పంపిణీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం మార్పులు చేసినది, దాంతో ఈసారి కూడా ఉద్యోగులు సానుకూల నిర్ణయానికి ఆశపడుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







