మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..

- December 13, 2025 , by Maagulf
మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..

కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు.శనివారం తెల్లవారు జామున కోల్‌కతాలో అడుగు పెట్టిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఉదయం కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ సందడి చేశారు. అతన్ని చూసేందుకు పెద్దెత్తున అభిమానులు తరలివచ్చారు.

మెస్సిని దగ్గరి నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని కొన్నిరోజులుగా అభిమానులు ఎదురు చూశారు. ఇలాంటి సమయంలో మెస్సీ స్టేడియంలో నుంచి త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వీరిలో కొందరు అభిమానులు బారికేడ్లు దాటుకొని మైదానంలోకి వచ్చి రచ్చరచ్చ చేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను కూల్చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com