మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- December 13, 2025
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు.శనివారం తెల్లవారు జామున కోల్కతాలో అడుగు పెట్టిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఉదయం కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియంలో మెస్సీ సందడి చేశారు. అతన్ని చూసేందుకు పెద్దెత్తున అభిమానులు తరలివచ్చారు.
మెస్సిని దగ్గరి నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని కొన్నిరోజులుగా అభిమానులు ఎదురు చూశారు. ఇలాంటి సమయంలో మెస్సీ స్టేడియంలో నుంచి త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వీరిలో కొందరు అభిమానులు బారికేడ్లు దాటుకొని మైదానంలోకి వచ్చి రచ్చరచ్చ చేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన టెంట్ను కూల్చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







