మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- December 13, 2025
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు.శనివారం తెల్లవారు జామున కోల్కతాలో అడుగు పెట్టిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఉదయం కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియంలో మెస్సీ సందడి చేశారు. అతన్ని చూసేందుకు పెద్దెత్తున అభిమానులు తరలివచ్చారు.
మెస్సిని దగ్గరి నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని కొన్నిరోజులుగా అభిమానులు ఎదురు చూశారు. ఇలాంటి సమయంలో మెస్సీ స్టేడియంలో నుంచి త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వీరిలో కొందరు అభిమానులు బారికేడ్లు దాటుకొని మైదానంలోకి వచ్చి రచ్చరచ్చ చేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన టెంట్ను కూల్చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేశారు.
తాజా వార్తలు
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష









