ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..
- December 15, 2025
అమెరికా: హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం నేటి నుంచే సమగ్ర స్క్రీనింగ్ ప్రక్రియను అమల్లోకి తెచ్చింది.ఈ కొత్త విధానంలో భాగంగా వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించనున్నారు.ఈ విషయాన్ని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారికంగా వెల్లడించింది.ఇక పై డాక్యుమెంట్లతో పాటు ఆన్లైన్ కార్యకలాపాలు కూడా వీసా నిర్ణయాల్లో కీలకంగా మారనున్నాయి.
హెచ్-1బీతో పాటు హెచ్-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలనూ పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అందుకే అభ్యర్థులు తమ ఖాతాలను ప్రైవేట్ నుంచి పబ్లిక్కు మార్చుకోవాలని సూచించారు. ఇప్పటికే భారత్లో హెచ్-1బీ (H-1B) ఇంటర్వ్యూలు పూర్తి చేసినవారికీ, తాజా మార్గదర్శకాల నేపథ్యంలో మరోసారి ఇంటర్వ్యూకు పిలిచే అవకాశం ఉందన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
ఈ అంశంపై స్పందించిన స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి, అమెరికా వీసా హక్కు కాదని, అది భద్రతా ప్రమాణాల ఆధారంగా ఇచ్చే అనుమతిమాత్రమేనని అన్నారు. దేశ భద్రతకు, ప్రజారక్షణకు ముప్పుగా మారే అంశాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించేందుకే ఈ కఠిన పరిశీలన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో హెచ్-1బీ, హెచ్-4 వీసాలపై ఉన్న భారతీయులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!







