ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..
- December 15, 2025
అమెరికా: హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం నేటి నుంచే సమగ్ర స్క్రీనింగ్ ప్రక్రియను అమల్లోకి తెచ్చింది.ఈ కొత్త విధానంలో భాగంగా వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించనున్నారు.ఈ విషయాన్ని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారికంగా వెల్లడించింది.ఇక పై డాక్యుమెంట్లతో పాటు ఆన్లైన్ కార్యకలాపాలు కూడా వీసా నిర్ణయాల్లో కీలకంగా మారనున్నాయి.
హెచ్-1బీతో పాటు హెచ్-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలనూ పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అందుకే అభ్యర్థులు తమ ఖాతాలను ప్రైవేట్ నుంచి పబ్లిక్కు మార్చుకోవాలని సూచించారు. ఇప్పటికే భారత్లో హెచ్-1బీ (H-1B) ఇంటర్వ్యూలు పూర్తి చేసినవారికీ, తాజా మార్గదర్శకాల నేపథ్యంలో మరోసారి ఇంటర్వ్యూకు పిలిచే అవకాశం ఉందన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
ఈ అంశంపై స్పందించిన స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి, అమెరికా వీసా హక్కు కాదని, అది భద్రతా ప్రమాణాల ఆధారంగా ఇచ్చే అనుమతిమాత్రమేనని అన్నారు. దేశ భద్రతకు, ప్రజారక్షణకు ముప్పుగా మారే అంశాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించేందుకే ఈ కఠిన పరిశీలన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో హెచ్-1బీ, హెచ్-4 వీసాలపై ఉన్న భారతీయులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







