ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..

- December 15, 2025 , by Maagulf
ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..

అమెరికా: హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం నేటి నుంచే సమగ్ర స్క్రీనింగ్ ప్రక్రియను అమల్లోకి తెచ్చింది.ఈ కొత్త విధానంలో భాగంగా వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించనున్నారు.ఈ విషయాన్ని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా వెల్లడించింది.ఇక పై డాక్యుమెంట్లతో పాటు ఆన్‌లైన్ కార్యకలాపాలు కూడా వీసా నిర్ణయాల్లో కీలకంగా మారనున్నాయి.

హెచ్-1బీతో పాటు హెచ్-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలనూ పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అందుకే అభ్యర్థులు తమ ఖాతాలను ప్రైవేట్ నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని సూచించారు. ఇప్పటికే భారత్‌లో హెచ్-1బీ (H-1B) ఇంటర్వ్యూలు పూర్తి చేసినవారికీ, తాజా మార్గదర్శకాల నేపథ్యంలో మరోసారి ఇంటర్వ్యూకు పిలిచే అవకాశం ఉందన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది.

ఈ అంశంపై స్పందించిన స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి, అమెరికా వీసా హక్కు కాదని, అది భద్రతా ప్రమాణాల ఆధారంగా ఇచ్చే అనుమతిమాత్రమేనని అన్నారు. దేశ భద్రతకు, ప్రజారక్షణకు ముప్పుగా మారే అంశాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించేందుకే ఈ కఠిన పరిశీలన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో హెచ్-1బీ, హెచ్-4 వీసాలపై ఉన్న భారతీయులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com