14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!

- December 15, 2025 , by Maagulf
14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!

కువైట్: కువైట్ లో బ్యాచిలర్స్ కు చట్టవిరుద్ధంగా రెంట్ కు ఇచ్చిన ఆస్తులపై చర్యలు తీసుకుంటున్నారు.కేవలం 14 రోజుల్లోనే 21 ఆస్తులకు విద్యుత్తును నిలిపివేసి, 38 మందికి నోటీసులు జారీ చేసినట్లు ఫర్వానియా గవర్నరేట్ మునిసిపాలిటీ శాఖలోని అత్యవసర బృంద అధిపతి మొహమ్మద్ అల్-జలావి తెలిపారు. 

మునిసిపాలిటీ 12 మంది ఇన్స్పెక్టర్లతో కూడిన ఆరు మొబైల్ ఫీల్డ్ బృందాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.  ఖైతాన్‌లో ఉల్లంఘనలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయని అన్నారు. ఆ తర్వాత అల్-రబియా, అల్-ఒమారియా, అల్-అండలస్ మరియు అల్-ఫిర్దౌస్ నివాస ప్రాంతాలలో ఉల్లంఘనలు అధికంగా నమోదు అవుతున్నాయని తెలిపారు. 

ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా బ్యాచిలర్స్ కు ఇవ్వడం, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించడం, గదుల్లో అంతర్గత పార్టిషన్లు ఏర్పాటు చేయడం వంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహారిస్తామని, వీటిని గుర్తించడానికి నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని మొహమ్మద్ అల్-జలావి వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com