14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- December 15, 2025
కువైట్: కువైట్ లో బ్యాచిలర్స్ కు చట్టవిరుద్ధంగా రెంట్ కు ఇచ్చిన ఆస్తులపై చర్యలు తీసుకుంటున్నారు.కేవలం 14 రోజుల్లోనే 21 ఆస్తులకు విద్యుత్తును నిలిపివేసి, 38 మందికి నోటీసులు జారీ చేసినట్లు ఫర్వానియా గవర్నరేట్ మునిసిపాలిటీ శాఖలోని అత్యవసర బృంద అధిపతి మొహమ్మద్ అల్-జలావి తెలిపారు.
మునిసిపాలిటీ 12 మంది ఇన్స్పెక్టర్లతో కూడిన ఆరు మొబైల్ ఫీల్డ్ బృందాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఖైతాన్లో ఉల్లంఘనలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయని అన్నారు. ఆ తర్వాత అల్-రబియా, అల్-ఒమారియా, అల్-అండలస్ మరియు అల్-ఫిర్దౌస్ నివాస ప్రాంతాలలో ఉల్లంఘనలు అధికంగా నమోదు అవుతున్నాయని తెలిపారు.
ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా బ్యాచిలర్స్ కు ఇవ్వడం, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించడం, గదుల్లో అంతర్గత పార్టిషన్లు ఏర్పాటు చేయడం వంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహారిస్తామని, వీటిని గుర్తించడానికి నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని మొహమ్మద్ అల్-జలావి వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్









