దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- December 16, 2025
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగుతున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు చివరి రోజు సోమవారం పూర్ణాహుతితో దిగ్విజయంగా ముగిశాయి. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలతో కృష్ణమ్మ ఒడిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేవస్థానం స్థానాచార్యులు శివ ప్రసాద్, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, ఇతర వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పాత యాగశాలలో ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. సీనా నాయక్ (స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్), ముఖ్య పండుగ అధికారి మూర్తి (ఈవో, ద్వారకా తిరుమల), ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు దుర్గమ్మ దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం పండితులు, అర్చకులు భక్తులకు, అధికారులకు వేద ఆశీర్వచనం అందించారు.
11వ తేదీ నుండి భక్తుల సంఖ్య 5,15,000, లడ్డు ప్రసాదం పంపిణీ 21.20 లక్షలు, అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు 2,03,645, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులు 51,435 అని ఇఓ తెలిపారు.
భవాని దీక్షలు 2025 అత్యంత సంతృప్తికరమైన వరణంలో, భక్తుల వాతా నుంచి విశేష స్పందనతో విజయవంతంగా ముగిశాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. సోమవారం ఇంద్రకీలాద్రి పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భక్తుల సౌక ర్యార్థం జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో చేసిన ఏర్పాట్లు సత్ఫలితాల నిచ్చాయనిచ్చాయన్నారు. అన్ని శాఖల సమన్వయంతో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, మున్సిపల్ సహా ప్రతి శాఖాధికారులు, సిబ్బంది పండుగ విజయవంతానికి పగలు, రాత్రి అనకుండా కృషి చేశారని కొనియాడారు. భవాని భక్తుల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మంగళవారం కూడా కొనసాగుతాయని, బుధవారం నుండి దేవస్థానం యథావిధిగా పనిచేస్తుందన్నారు. ప్రెస్మిట్ అనంతరం, కలెక్టర్, అధికారులు, దేవస్థానం పాలకమండలి చైర్మన్ అండ్ సభ్యులు క్యూలైన్లు, ఘాట్లను స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







