ఆధార్ కొత్త నియమాలు తెలుసా
- December 16, 2025
న్యూ ఢిల్లీ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ఆధార్ కొత్త రూల్స్ దేశంలో డిజిటల్ ఐడెంటిఫికేషన్ విధానంలో కొత్త మైలురాయి సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఫేస్ అథెంటికేషన్ను అధికారికంగా ప్రవేశపెట్టడం, వినియోగదారుల గోప్యతను కఠినంగా కాపాడటం ఈ రూల్స్లో ప్రధాన మార్పులు. ఫేస్ అథెంటికేషన్ ద్వారా, వీలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్ పనిచేయని సందర్భాల్లో ఆధార్ ధృవీకరణ సులభతరం అవుతుంది. UIDAI అధికారులు దీన్ని “ప్రూఫ్ ఆఫ్ ప్రజెన్స్”గా పరిగణిస్తూ, ధృవీకరణ చోటే ఆధార్ హోల్డర్ భౌతికంగా ఉన్నాడా అని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. దీని ద్వారా ఈవెంట్స్, హోటల్స్ చెకిన్స్, డెలివరీ అంగీకారాలు వంటి వివిధ సందర్భాల్లో ఆధార్ ఉపయోగాన్ని విస్తరించవచ్చు.
ప్రైవసీ పరంగా, కొత్త రూల్స్ DPDP చట్టానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఆధార్ ఉపయోగానికి కేవలం అవసరమైన కనీస డేటా మాత్రమే సేకరించబడుతుంది. ఉదాహరణకు, ఒక సేవకు వయస్సు లేదా ఫోటో మాత్రమే అవసరమైతే, పూర్తి ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే, వినియోగదారుడి స్పష్టమైన అనుమతి తప్పనిసరిగా అవసరం. ఇకపై, ప్రైవేట్ సంస్థలు ఆధార్ వివరాలను OTP ఆధారంగా సేకరించడం చట్టబద్ధం కాదు. కొత్త రూల్స్ ద్వారా ఆధార్ వివరాలను UIDAI డేటాబేస్తో సంబంధం లేకుండా ఆఫ్లైన్లో ధృవీకరించవచ్చు. ఆధార్ యాప్ ద్వారా వినియోగదారులు తమ డివైజ్లోనే డిజిటల్ సంతకం చేసిన వివరాలను ఉంచి, QR కోడ్ల ద్వారా మాత్రమే అవసరమైన సమాచారాన్ని పంచుకోవచ్చు. ఈ మార్పుల వల్ల ఫేస్ అథెంటికేషన్ వంటి సౌకర్యాలతో పాటు వినియోగదారుల గోప్యతను మరింత కాపాడుతూ, ఆధార్ సేవలను సులభంగా మరియు భద్రంగా ఉపయోగించవచ్చు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









