డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- February 08, 2026
కువైట్:కువైట్ లో మాదకద్రవ్య కేసులకు సంబంధించి వివిధ దేశాలకు చెందిన 16 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాదకద్రవ్యాలు మరియు వాటి తయారీ, పంపిణీలో ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మాదకద్రవ్య వ్యాపారులు మరియు వినియోగదారులను గుర్తించడానికి మోడ్రన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో 880 గ్రాముల మెథాంఫెటమైన్ (క్రిస్టల్ మెత్), 745 గ్రాముల హషీష్, మూడు ముక్కలు హషీష్, 151 గ్రాముల సింథటిక్ కానబినాయిడ్స్, 40 మిల్లీలీటర్ల సింథటిక్ కానబినాయిడ్ ఆయిల్, మూడు గ్రాముల హెరాయిన్, 5,000 కాప్టాగన్ పిల్స్, అలాగే మాదకద్రవ్యాలను తూకం వేయడానికి ఉపయోగించే అనేక ఉపకరణాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిందితులపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







