డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- February 08, 2026
కువైట్:కువైట్ లో మాదకద్రవ్య కేసులకు సంబంధించి వివిధ దేశాలకు చెందిన 16 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాదకద్రవ్యాలు మరియు వాటి తయారీ, పంపిణీలో ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మాదకద్రవ్య వ్యాపారులు మరియు వినియోగదారులను గుర్తించడానికి మోడ్రన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో 880 గ్రాముల మెథాంఫెటమైన్ (క్రిస్టల్ మెత్), 745 గ్రాముల హషీష్, మూడు ముక్కలు హషీష్, 151 గ్రాముల సింథటిక్ కానబినాయిడ్స్, 40 మిల్లీలీటర్ల సింథటిక్ కానబినాయిడ్ ఆయిల్, మూడు గ్రాముల హెరాయిన్, 5,000 కాప్టాగన్ పిల్స్, అలాగే మాదకద్రవ్యాలను తూకం వేయడానికి ఉపయోగించే అనేక ఉపకరణాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిందితులపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







