డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- February 08, 2026
కువైట్:కువైట్ లో మాదకద్రవ్య కేసులకు సంబంధించి వివిధ దేశాలకు చెందిన 16 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాదకద్రవ్యాలు మరియు వాటి తయారీ, పంపిణీలో ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మాదకద్రవ్య వ్యాపారులు మరియు వినియోగదారులను గుర్తించడానికి మోడ్రన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో 880 గ్రాముల మెథాంఫెటమైన్ (క్రిస్టల్ మెత్), 745 గ్రాముల హషీష్, మూడు ముక్కలు హషీష్, 151 గ్రాముల సింథటిక్ కానబినాయిడ్స్, 40 మిల్లీలీటర్ల సింథటిక్ కానబినాయిడ్ ఆయిల్, మూడు గ్రాముల హెరాయిన్, 5,000 కాప్టాగన్ పిల్స్, అలాగే మాదకద్రవ్యాలను తూకం వేయడానికి ఉపయోగించే అనేక ఉపకరణాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిందితులపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ..ముగిసిన ముంబై ఇండియన్స్ కథ
- ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విజయవంతంగా తలసేమియా రన్
- ఈస్ట్ బెంగళూరులో సమగ్ర మహిళలు-శిశు ఆసుపత్రిని ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్-30 మే 31 వరకు పొడిగింపు
- సౌదీ అరేబియాలో ఘనంగా టీడీపీ ‘మినీ మహానాడు’
- డెహ్రాడూన్లో ఆర్చి కూలి ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి
- పవన్ కళ్యాణ్ను కలిసిన ప్రధాని మోదీ..
- ప్రధాని మోదీ ఆత్మీయత మరువలేనిది: సీఎం చంద్రబాబు
- యూఏఈలో మే 11 నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ









