సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- February 08, 2026
రియాద్ః సౌదీ భద్రతా అధికారులు ఒక వారంలో 20,237 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. జనవరి 29 మరియు ఫిబ్రవరి 4 మధ్య భద్రతా దళాలు నిర్వహించిన సంయుక్త తనిఖీలలో భాగంగా వీరిని అరెస్టు చేశారని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అరెస్టు అయిన వారిలో 12,687 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించినవారు, 4,318 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినవారు మరియు 3,232 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారు. మొత్తం 11,656 మంది అక్రమ నివాసితులను బహిష్కరించగా, 16,805 మంది ఉల్లంఘనదారులను ప్రయాణ పత్రాల కోసం వారి దౌత్య కార్యాలయాలకు రిఫర్ చేశారు.ఇక సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తూ అరెస్టు అయిన వారి మొత్తం సంఖ్య 1,555, వీరిలో 40 శాతం మంది యెమెన్ జాతీయులు, 57 శాతం మంది ఇథియోపియన్ జాతీయులు మరియు మూడు శాతం మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు.
సౌదీలోకి అక్రమంగా ప్రవేశించడానికి సహకరించినా, వారికి ఆశ్రయం కల్పించినా లేదా మరేదైనా సహాయం చేసిన వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 10 లక్షల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్కు, మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు ఫోన్ చేసి, ఉల్లంఘనలకు సంబంధించిన ఏవైనా కేసులను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- IPL 2026: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ..ముగిసిన ముంబై ఇండియన్స్ కథ
- ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విజయవంతంగా తలసేమియా రన్
- ఈస్ట్ బెంగళూరులో సమగ్ర మహిళలు-శిశు ఆసుపత్రిని ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్-30 మే 31 వరకు పొడిగింపు
- సౌదీ అరేబియాలో ఘనంగా టీడీపీ ‘మినీ మహానాడు’
- డెహ్రాడూన్లో ఆర్చి కూలి ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి
- పవన్ కళ్యాణ్ను కలిసిన ప్రధాని మోదీ..
- ప్రధాని మోదీ ఆత్మీయత మరువలేనిది: సీఎం చంద్రబాబు
- యూఏఈలో మే 11 నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ









