ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- December 17, 2025
గుడివాడ: ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున బుధవారం కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ఆయన రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. నాగార్జున మాట్లాడుతూ మనుషులు శాశ్వతం కాదని, మనం చేసే పనులు శాశ్వతమని అన్నారు.
తన తండ్రి నాగేశ్వరరావు చదువుకోకపోయినా, చదువుపై ఉన్న ఇష్టంతో వేల మందికి బంగారు భవిష్యత్తును అందించారని, 1959లో నాగేశ్వరరావు కళాశాలకు రూ.లక్ష విరాళం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే వెనిగండల్ల రాము,కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!









