షార్జా మున్సిపాలిటీ వద్ద అద్దెని తగ్గించమని అడిగేందుకు బారులు తీరిన ప్రజలు

- July 27, 2016 , by Maagulf
షార్జా మున్సిపాలిటీ వద్ద  అద్దెని తగ్గించమని అడిగేందుకు బారులు తీరిన ప్రజలు

షార్జా మున్సిపాలిటీ నివాస అద్దెకు ఒప్పందాలు 'ధృవీకరణ ఫీజు రెట్టింపు ప్రకటన వెలువడిన నాటి నుంచి     షార్జా మున్సిపాలిటీ వద్ద  అద్దెని తగ్గించమని అడిగేందుకు ప్రజలు బారులు తీరారు.  ఆగష్టు 1 వ  తేదీ నుంచి వార్షిక కిరాయిని 2 శాతం నుండి 4 శాతం వరకు రెట్టింపు చేయనున్నారు. దీనితో అధిక సంఖ్యలో ప్రజలు  కౌలు ఒప్పందం ధృవీకరణ కేంద్రాల వద్ద వేచి ఉన్నారు. భారీ రద్దీ ఆ ప్రాంతంలో ఎందుకు ఏర్పడిందంటే అకస్మాత్తుగా రెట్టింపు ఫీజుని  చెల్లించమని వత్తిడిని  నివారించేందుకు వారు అక్కడ గూమిగూడేరు. ఇది చాలదనట్లుగా షార్జా మున్సిపాలిటీ కూడా  కౌలు ఒప్పందం పత్రాల కోసం రుసుము  50 దినార్ల నుండి 100 దినార్ల  వరకు కౌలు ఒప్పంద పత్రాల కోసం రుసుము రెట్టింపయినట్లుగా  ప్రకటించారు. వాణిజ్య  ఒప్పందం ఫీజు కూడా 5 శాతం పెంచారు జూలై 18 వ తేదీ ప్రకటన వెలువడిన సమయం నుండి ఈ ఒప్పందం ధృవీకరణ కోసం కేంద్రాల వద్ద రోజుకు 450 మందికి తగ్గకుండా వస్తున్నారని , ఇప్పటివరకు 2,500 మంది  అద్దెదారులు విభ్రాంతికరమైన సంఖ్యలో ఇక్కడకు వస్తున్నారు.  ఈ రోజు 5,000 మంది వరకు ఇక్కడ  బారులు తీరి ఉంటారని అంచనా వేస్తున్నారు, భారీగా వస్తున్న సమూహాలు నిర్వహించడానికి, అద్దె నియంత్రణ విభాగంలో సేవలు విస్తరించేందుకు ఉద్యోగుల పని గంటలు ఈ  నెలాఖరు వరకు మున్సిపాలిటీ పెంచనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com