తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం
- December 20, 2025
హైదరాబాద్: తెలంగాణలో రహదారి భద్రత విషయంలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా సగటున ప్రతిరోజూ 74 ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి, వీటిలో సుమారు 20 మంది ప్రాణాలను కోల్పోతున్నారు.వాహనదారుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి. గతేడాది రోజుకు సగటున 52,000 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యే నాటికి, ఈ ఏడాది ఆ సంఖ్య 72,000కి చేరటం, పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. రహదారి ప్రమాదాలు కేవలం గణాంకాలతో కాకుండా, సామాజిక భద్రతను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా హైవేలు, బస్సు రూట్లలో ప్రమాదాల సంఖ్య అధికంగా ఉండటం, ప్రజలలో భయాన్ని పెంచుతోంది.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి తెలంగాణ పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ‘అరైవ్.. అలైవ్’ (‘Arrive.. Alive’) కార్యక్రమం ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నియమాలు పాటించడానికి అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా అతివేగం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మున్ముందు, హైవేలపై రాంగ్రూట్ లో ప్రయాణించే వాహనాలను స్వాధీనం చేసుకునే, నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయడం వంటి చర్యలు పరిశీలనలో ఉన్నాయి. వాహనదారుల్లో మార్పు తీసుకొచ్చేందుకు, రహదారి ప్రమాదాల్లో తమ ప్రియజనలను కోల్పోయిన కుటుంబాల అనుభవాలను పంచుకునే కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు.ఈ విధంగా మానవీయ కోణం ద్వారా, రహదారులను సురక్షితంగా మార్చాలని పోలీసులు ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!









