తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం
- December 20, 2025
హైదరాబాద్: తెలంగాణలో రహదారి భద్రత విషయంలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా సగటున ప్రతిరోజూ 74 ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి, వీటిలో సుమారు 20 మంది ప్రాణాలను కోల్పోతున్నారు.వాహనదారుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి. గతేడాది రోజుకు సగటున 52,000 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యే నాటికి, ఈ ఏడాది ఆ సంఖ్య 72,000కి చేరటం, పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. రహదారి ప్రమాదాలు కేవలం గణాంకాలతో కాకుండా, సామాజిక భద్రతను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా హైవేలు, బస్సు రూట్లలో ప్రమాదాల సంఖ్య అధికంగా ఉండటం, ప్రజలలో భయాన్ని పెంచుతోంది.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి తెలంగాణ పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ‘అరైవ్.. అలైవ్’ (‘Arrive.. Alive’) కార్యక్రమం ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నియమాలు పాటించడానికి అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా అతివేగం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మున్ముందు, హైవేలపై రాంగ్రూట్ లో ప్రయాణించే వాహనాలను స్వాధీనం చేసుకునే, నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయడం వంటి చర్యలు పరిశీలనలో ఉన్నాయి. వాహనదారుల్లో మార్పు తీసుకొచ్చేందుకు, రహదారి ప్రమాదాల్లో తమ ప్రియజనలను కోల్పోయిన కుటుంబాల అనుభవాలను పంచుకునే కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు.ఈ విధంగా మానవీయ కోణం ద్వారా, రహదారులను సురక్షితంగా మార్చాలని పోలీసులు ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం







