బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- February 08, 2026
మనామా: బహ్రెయిన్ లోని కేరళ కాథలిక్ అసోసియేషన్ (కేసీఏ) “గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్”ను నిర్వహించనుంది. ఇందులో భారతదేశ చరిత్ర, సంస్కృతి ఆధారంగా ప్రశ్నావళి ఉంటుంది. ఏప్రిల్ 17న సాయంత్రం 4:00 గంటలకు జరగనున్న ఈ క్విజ్, భారతదేశం మరియు బహ్రెయిన్ మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రవాస భారతీయులలో అభ్యాస స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ పోటీని గ్రాండ్మాస్టర్ జూనియర్స్ (18 ఏళ్ల లోపు) మరియు గ్రాండ్మాస్టర్ సీనియర్స్ (18 ఏళ్ల పైబడినవారు) విభాగంలో నిర్వహిస్తుండగా, ప్రతి జట్టులో ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు భారతీయ క్విజ్ రంగంలో ప్రసిద్ధ వ్యక్తి అయిన డాక్టర్ రాజు నారాయణస్వామి (ఐఏఎస్) క్విజ్ మాస్టర్గా వ్యవహరిస్తారు. విజేతలకు 500 యూఎస్ డాలర్లు, రెండవ మరియు మూడవ స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా 300 యూఎస్ డాలర్లు మరియు 200 యూఎస్ డాలర్లు అందించనున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు మార్చి 1న ప్రారంభమవుతాయని, జూనియర్లకు ఒక్కో జట్టుకు BD 6 మరియు సీనియర్లకు BD10 రిజిస్ట్రేషన్ రుసుము ఉంటుందని కేసీఏ అధ్యక్షుడు జేమ్స్ జాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







