బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- February 08, 2026
మనామా: బహ్రెయిన్ లోని కేరళ కాథలిక్ అసోసియేషన్ (కేసీఏ) “గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్”ను నిర్వహించనుంది. ఇందులో భారతదేశ చరిత్ర, సంస్కృతి ఆధారంగా ప్రశ్నావళి ఉంటుంది. ఏప్రిల్ 17న సాయంత్రం 4:00 గంటలకు జరగనున్న ఈ క్విజ్, భారతదేశం మరియు బహ్రెయిన్ మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రవాస భారతీయులలో అభ్యాస స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ పోటీని గ్రాండ్మాస్టర్ జూనియర్స్ (18 ఏళ్ల లోపు) మరియు గ్రాండ్మాస్టర్ సీనియర్స్ (18 ఏళ్ల పైబడినవారు) విభాగంలో నిర్వహిస్తుండగా, ప్రతి జట్టులో ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు భారతీయ క్విజ్ రంగంలో ప్రసిద్ధ వ్యక్తి అయిన డాక్టర్ రాజు నారాయణస్వామి (ఐఏఎస్) క్విజ్ మాస్టర్గా వ్యవహరిస్తారు. విజేతలకు 500 యూఎస్ డాలర్లు, రెండవ మరియు మూడవ స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా 300 యూఎస్ డాలర్లు మరియు 200 యూఎస్ డాలర్లు అందించనున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు మార్చి 1న ప్రారంభమవుతాయని, జూనియర్లకు ఒక్కో జట్టుకు BD 6 మరియు సీనియర్లకు BD10 రిజిస్ట్రేషన్ రుసుము ఉంటుందని కేసీఏ అధ్యక్షుడు జేమ్స్ జాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









