నాలుగు నిఘా విమానాలు బోయింగ్‌ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిన భారత్

- July 27, 2016 , by Maagulf
నాలుగు నిఘా విమానాలు బోయింగ్‌ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిన భారత్

చైనాను దృష్టిలో ఉంచుకుని భారత్‌ సుమారు బిలియన్‌ డాలర్ల విలువ చేసే నాలుగు నిఘా విమానాలు కొనుగోలు చేయడానికి బోయింగ్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌ నేవీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, హిందూమహా సముద్రంలో చైనా ఉనికిని పర్యవేక్షించడానికి నిఘా విమానాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో చైనా జలాంతర్గాముల గురించి తెలుసుకోవడానికి ఎనిమిది పీ-81 విమానాలను వినియోగిస్తున్నారు. ఈరోజు మరో నాలుగు కొత్త విమానాల కొనుగోలుకు డీల్‌ కుదుర్చుకున్నారు. ఒప్పందంపై నేడు సంతకం చేసినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడలేదు. చైనా నేవీ హిందూ మహాసముద్రంలోకి ఎక్కువ ప్రాంతాలకు తమ జలాంతర్గాములను పంపిస్తున్న నేపథ్యంలో భారత్‌ నిఘా పటిష్ఠం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com