నాలుగు నిఘా విమానాలు బోయింగ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిన భారత్
- July 27, 2016
చైనాను దృష్టిలో ఉంచుకుని భారత్ సుమారు బిలియన్ డాలర్ల విలువ చేసే నాలుగు నిఘా విమానాలు కొనుగోలు చేయడానికి బోయింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ నేవీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, హిందూమహా సముద్రంలో చైనా ఉనికిని పర్యవేక్షించడానికి నిఘా విమానాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో చైనా జలాంతర్గాముల గురించి తెలుసుకోవడానికి ఎనిమిది పీ-81 విమానాలను వినియోగిస్తున్నారు. ఈరోజు మరో నాలుగు కొత్త విమానాల కొనుగోలుకు డీల్ కుదుర్చుకున్నారు. ఒప్పందంపై నేడు సంతకం చేసినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడలేదు. చైనా నేవీ హిందూ మహాసముద్రంలోకి ఎక్కువ ప్రాంతాలకు తమ జలాంతర్గాములను పంపిస్తున్న నేపథ్యంలో భారత్ నిఘా పటిష్ఠం చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







