అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్రకుమార్
- December 24, 2025
విజయవాడ: అదనపు సొలిసిటర్ జనరల్గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నియమితులయ్యారు.సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరల్స్ను కేంద్రం తాజాగా నియమించింది.కనకమేడలతో పాటు దవీందర్పాల్ సింగ్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కనకమేడల రవీంద్ర కుమార్ గతంలో తెలుగుదేశం పార్టీ తరుఫున రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. రాజకీయాలతో పాటుగా న్యాయరంగంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్ర కుమార్ను సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై కీలక పాత్ర పోషించనున్నారు.
తాజా వార్తలు
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక నిధి సమీకరణ కార్యక్రమం
- రైల్వే శాఖ కీలక నిర్ణయం...
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు
- వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- వైఎస్ జగన్కు అస్వస్థత.. పులివెందుల కార్యక్రమాల రద్దు
- ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు







