రైల్వే శాఖ కీలక నిర్ణయం...
- December 24, 2025
న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే అటవీ జంతువుల రక్షణ దిశగా మరో కీలకమైన ముందడుగు వేసింది. అడవుల గుండా వెళ్లే రైల్వే ట్రాక్ ల పై తరచూ జరుగుతున్న జంతు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణతో పాటు వన్యప్రాణుల భద్రతకు ఎంతో ఉపయోగపడనుంది.
ఈ ఏఐ కెమెరాలు ట్రాక్పై జంతువులు ఉంటే లోకో పైలట్లకు 0.5 కిలోమీటర్ల దూరంలోనే సమాచారం అందిస్తాయి. ఇటీవల నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సెక్షన్లో 141 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్) విజయవంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా మరో 981 కిలోమీటర్ల మేర ఈ కెమెరాలను అమర్చాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









