వైఎస్ జగన్కు అస్వస్థత.. పులివెందుల కార్యక్రమాల రద్దు
- December 24, 2025
అమరావతి: వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ పర్యటన రద్దయ్యింది. ప్రస్తుతం వైయస్ జగన్ జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో వెల్లడించింది. దీంతో ఇవాళ పులివెందులలో జరగాల్సిన రెండో పర్యటన వాయిదా పడింది. జగన్ కు తగిన విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారని సమాచారం. అందుకే నేటి కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.
అయితే రెండో రోజైన ఇవాళ పర్యటన జ్వరం కారణంగా ఆకస్మికంగా నిలిచిపోయింది. ఈ షెడ్యూల్లో భాగంగా ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకోవాల్సింది. అక్కడ ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనాల్లో జగన్ పాల్గొనాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు పులివెందులకు తిరుగు ప్రయాణమైన భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించి అక్కడే బస చేయాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణంగా వాటన్నింటిని వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!







