వైఎస్ జగన్కు అస్వస్థత.. పులివెందుల కార్యక్రమాల రద్దు
- December 24, 2025
అమరావతి: వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ పర్యటన రద్దయ్యింది. ప్రస్తుతం వైయస్ జగన్ జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో వెల్లడించింది. దీంతో ఇవాళ పులివెందులలో జరగాల్సిన రెండో పర్యటన వాయిదా పడింది. జగన్ కు తగిన విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారని సమాచారం. అందుకే నేటి కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.
అయితే రెండో రోజైన ఇవాళ పర్యటన జ్వరం కారణంగా ఆకస్మికంగా నిలిచిపోయింది. ఈ షెడ్యూల్లో భాగంగా ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకోవాల్సింది. అక్కడ ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనాల్లో జగన్ పాల్గొనాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు పులివెందులకు తిరుగు ప్రయాణమైన భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించి అక్కడే బస చేయాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణంగా వాటన్నింటిని వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









