వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- December 24, 2025
తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలోని వయనాడులో ఈరోజు జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) మరియు ఇతర సంబంధిత సంస్థల CMDలతో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని ప్రజా మౌలిక సదుపాయాలు, ప్రజా వినియోగాల పై రుసుములు, సుంకాలు, వినియోగదారు ఛార్జీల విధింపు మరియు నియంత్రణపై చర్చలు జరిపారు.
కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమగ్రంగా చర్చించడం ద్వారా, పౌరులకు మౌలిక సదుపాయాల సరళమైన లభ్యత, సౌకర్యాలు, మరియు పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల ధరల నియంత్రణ పట్ల అవగాహన పెంచడంలో ముఖ్యమైన దశగా ఈ సమావేశాన్ని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









