వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- December 24, 2025
తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలోని వయనాడులో ఈరోజు జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) మరియు ఇతర సంబంధిత సంస్థల CMDలతో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని ప్రజా మౌలిక సదుపాయాలు, ప్రజా వినియోగాల పై రుసుములు, సుంకాలు, వినియోగదారు ఛార్జీల విధింపు మరియు నియంత్రణపై చర్చలు జరిపారు.
కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమగ్రంగా చర్చించడం ద్వారా, పౌరులకు మౌలిక సదుపాయాల సరళమైన లభ్యత, సౌకర్యాలు, మరియు పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల ధరల నియంత్రణ పట్ల అవగాహన పెంచడంలో ముఖ్యమైన దశగా ఈ సమావేశాన్ని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి







