వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- December 24, 2025
తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలోని వయనాడులో ఈరోజు జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) మరియు ఇతర సంబంధిత సంస్థల CMDలతో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని ప్రజా మౌలిక సదుపాయాలు, ప్రజా వినియోగాల పై రుసుములు, సుంకాలు, వినియోగదారు ఛార్జీల విధింపు మరియు నియంత్రణపై చర్చలు జరిపారు.
కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమగ్రంగా చర్చించడం ద్వారా, పౌరులకు మౌలిక సదుపాయాల సరళమైన లభ్యత, సౌకర్యాలు, మరియు పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల ధరల నియంత్రణ పట్ల అవగాహన పెంచడంలో ముఖ్యమైన దశగా ఈ సమావేశాన్ని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!







