వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- December 24, 2025
తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలోని వయనాడులో ఈరోజు జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) మరియు ఇతర సంబంధిత సంస్థల CMDలతో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని ప్రజా మౌలిక సదుపాయాలు, ప్రజా వినియోగాల పై రుసుములు, సుంకాలు, వినియోగదారు ఛార్జీల విధింపు మరియు నియంత్రణపై చర్చలు జరిపారు.
కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమగ్రంగా చర్చించడం ద్వారా, పౌరులకు మౌలిక సదుపాయాల సరళమైన లభ్యత, సౌకర్యాలు, మరియు పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల ధరల నియంత్రణ పట్ల అవగాహన పెంచడంలో ముఖ్యమైన దశగా ఈ సమావేశాన్ని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









