రైల్వే శాఖ కీలక నిర్ణయం...

- December 24, 2025 , by Maagulf
రైల్వే శాఖ కీలక నిర్ణయం...

న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే అటవీ జంతువుల రక్షణ దిశగా మరో కీలకమైన ముందడుగు వేసింది. అడవుల గుండా వెళ్లే రైల్వే ట్రాక్‌ ల పై తరచూ జరుగుతున్న జంతు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణతో పాటు వన్యప్రాణుల భద్రతకు ఎంతో ఉపయోగపడనుంది.

ఈ ఏఐ కెమెరాలు ట్రాక్‌పై జంతువులు ఉంటే లోకో పైలట్‌లకు 0.5 కిలోమీటర్ల దూరంలోనే సమాచారం అందిస్తాయి. ఇటీవల నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సెక్షన్‌లో 141 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్) విజయవంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా మరో 981 కిలోమీటర్ల మేర ఈ కెమెరాలను అమర్చాలని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com