బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- December 24, 2025
మనామా: వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులను బహ్రెయిన్ లకే పరిమితం చేయాలని కోరుతూ ఒక అత్యవసర ప్రతిపాదనకు పార్లమెంటు అంగీకరించింది. రహదారి భద్రత మరియు పని చేసే హక్కుతో సంబంధం ఉన్నందున పౌరులు మాత్రమే ఆ పాత్రను పోషించాలని ఎంపీలు కోరారు. ఈ ప్రతిపాదనను ఎంపీలు బాదర్ అల్ తమీమి, హసన్ ఇబ్రహీం, మొహమ్మద్ మౌసా, డాక్టర్ అలీ అల్ నుయిమి మరియు హమద్ అల్ డోయ్ పార్లమెంట్ లో ప్రతిపాదించారు.
కీలక రంగాలలో బహ్రెయిన్ లనే నియామించాలని, క్రమంగా విదేశీ కార్మికులను తొలగించాలని కోరారు. వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం జీవితాలు మరియు ఆస్తి భద్రతతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశమని వారు అన్నారు. ప్రైవేటీకరణ తరువాత విదేశీయులను ఆ పోస్టుల్లో నియమించారని, ఇది బహ్రెయిన్లకు ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలను తగ్గించిందని ఎంపీలు పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ పోస్టును బహ్రెయిన్ పౌరులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ఈ మేరకు సంబంధిత సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు క్రమంగా తమ విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







