బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- December 24, 2025
మనామా: వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులను బహ్రెయిన్ లకే పరిమితం చేయాలని కోరుతూ ఒక అత్యవసర ప్రతిపాదనకు పార్లమెంటు అంగీకరించింది. రహదారి భద్రత మరియు పని చేసే హక్కుతో సంబంధం ఉన్నందున పౌరులు మాత్రమే ఆ పాత్రను పోషించాలని ఎంపీలు కోరారు. ఈ ప్రతిపాదనను ఎంపీలు బాదర్ అల్ తమీమి, హసన్ ఇబ్రహీం, మొహమ్మద్ మౌసా, డాక్టర్ అలీ అల్ నుయిమి మరియు హమద్ అల్ డోయ్ పార్లమెంట్ లో ప్రతిపాదించారు.
కీలక రంగాలలో బహ్రెయిన్ లనే నియామించాలని, క్రమంగా విదేశీ కార్మికులను తొలగించాలని కోరారు. వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం జీవితాలు మరియు ఆస్తి భద్రతతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశమని వారు అన్నారు. ప్రైవేటీకరణ తరువాత విదేశీయులను ఆ పోస్టుల్లో నియమించారని, ఇది బహ్రెయిన్లకు ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలను తగ్గించిందని ఎంపీలు పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ పోస్టును బహ్రెయిన్ పౌరులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ఈ మేరకు సంబంధిత సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు క్రమంగా తమ విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









