బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- December 24, 2025
మనామా: వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులను బహ్రెయిన్ లకే పరిమితం చేయాలని కోరుతూ ఒక అత్యవసర ప్రతిపాదనకు పార్లమెంటు అంగీకరించింది. రహదారి భద్రత మరియు పని చేసే హక్కుతో సంబంధం ఉన్నందున పౌరులు మాత్రమే ఆ పాత్రను పోషించాలని ఎంపీలు కోరారు. ఈ ప్రతిపాదనను ఎంపీలు బాదర్ అల్ తమీమి, హసన్ ఇబ్రహీం, మొహమ్మద్ మౌసా, డాక్టర్ అలీ అల్ నుయిమి మరియు హమద్ అల్ డోయ్ పార్లమెంట్ లో ప్రతిపాదించారు.
కీలక రంగాలలో బహ్రెయిన్ లనే నియామించాలని, క్రమంగా విదేశీ కార్మికులను తొలగించాలని కోరారు. వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం జీవితాలు మరియు ఆస్తి భద్రతతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశమని వారు అన్నారు. ప్రైవేటీకరణ తరువాత విదేశీయులను ఆ పోస్టుల్లో నియమించారని, ఇది బహ్రెయిన్లకు ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలను తగ్గించిందని ఎంపీలు పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ పోస్టును బహ్రెయిన్ పౌరులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ఈ మేరకు సంబంధిత సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు క్రమంగా తమ విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







