సౌదీ అరేబియా: 2025 లో 356 మందికి మరణశిక్ష
- January 02, 2026
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు 2025లో రికార్డు స్థాయికి చేరింది. ఒక్క ఏడాదిలోనే 356 మందికి మరణ దండన అమలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఈ సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
డ్రగ్స్ రవాణా, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై సౌదీ ప్రభుత్వం ప్రకటించిన కఠిన వైఖరే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అమలు చేసిన మొత్తం మరణశిక్షల్లో 243 కేసులు డ్రగ్స్కు సంబంధించినవే కావడం విశేషం.
ఒకవైపు పర్యాటకం, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలతో దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలని సౌదీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానం దేశ ప్రతిష్టకు భిన్నమైన సందేశాన్ని ఇస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









