సౌదీ అరేబియా: 2025 లో 356 మందికి మరణశిక్ష
- January 02, 2026
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు 2025లో రికార్డు స్థాయికి చేరింది. ఒక్క ఏడాదిలోనే 356 మందికి మరణ దండన అమలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఈ సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
డ్రగ్స్ రవాణా, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై సౌదీ ప్రభుత్వం ప్రకటించిన కఠిన వైఖరే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అమలు చేసిన మొత్తం మరణశిక్షల్లో 243 కేసులు డ్రగ్స్కు సంబంధించినవే కావడం విశేషం.
ఒకవైపు పర్యాటకం, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలతో దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలని సౌదీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానం దేశ ప్రతిష్టకు భిన్నమైన సందేశాన్ని ఇస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









