సౌదీ అరేబియా: 2025 లో 356 మందికి మరణశిక్ష
- January 02, 2026
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు 2025లో రికార్డు స్థాయికి చేరింది. ఒక్క ఏడాదిలోనే 356 మందికి మరణ దండన అమలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఈ సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
డ్రగ్స్ రవాణా, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై సౌదీ ప్రభుత్వం ప్రకటించిన కఠిన వైఖరే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అమలు చేసిన మొత్తం మరణశిక్షల్లో 243 కేసులు డ్రగ్స్కు సంబంధించినవే కావడం విశేషం.
ఒకవైపు పర్యాటకం, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలతో దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలని సౌదీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానం దేశ ప్రతిష్టకు భిన్నమైన సందేశాన్ని ఇస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







