'తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి' అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు
- July 19, 2015
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ డి.సురేష్ బాబు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి అధ్యక్షుడయ్యారు. ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్లో జరిగాయి. చాంబర్లో భాగమైన నిర్మాణ, పంపిణీ, ప్రదర్శన, స్టూడియో - నాలుగు విభాగాల సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ నాలుగు సెక్టార్ల ఎన్నికలకు నిర్మాతలు - ఎగ్జిబిటర్లైన డి. సురేష్ బాబు, దిల్ రాజుల సారథ్యంలోని ఒక ప్యానెల్, నిర్మాతలు నట్టికుమార్, టి. ప్రసన్నకుమార్ల నేతృత్వంలోని మరో ప్యానెల్ పోటీపడ్డాయి. మొత్తం 48 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ను ఈ ఎన్నికల్లో ఎన్నుకున్నారు. సురేశ్బాబు ప్యానెల్ సభ్యులు ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. ఈ ఎన్నికైన సభ్యులు నాలుగు విభాగాల చైర్మన్లనూ ఎంపిక చేసుకున్నారు. పంపిణీదారుల విభాగానికి భరత్ చౌదరి, ప్రదర్శనదారుల విభాగానికి నారాయణబాబు, నిర్మాతల సెక్టార్కు ఆర్.కె. గౌడ్, స్టూడియో సెక్టార్కు నాగినీడు చైర్మన్లు అయ్యారు. ఇక, ఫిల్మ్ చాంబర్ అధ్యక్ష పదవి రొటేషన్ పద్ధతిలో ఎగ్జిబిటర్ల విభాగానికి దక్కాలి. దాన్ని అనుసరించి తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా డి. సురేశ్బాబు ఏకీగ్రవంగా ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా 'ఆనంద్ సినీ సర్వీసెస్' కిరణ్, 'దిల్' రాజు, రమేష్, కార్యదర్శిగా దామోదర ప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాస్, రాందాస్, సురేందర్రెడ్డి, కోశాధికారిగా కొడాలి వెంకటేశ్వర రావు ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









