ఖతార్ లో 80% తగ్గిన స్కూల్స్ లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులు..!!
- January 04, 2026
దోహా: ఖతార్ లో స్కూల్స్ లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులు 80శాతం తగ్గనున్నాయి. ఇందు కోసం ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్ల కోసం అధునాతన లైసెన్సింగ్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ముఖ్యంగా మునుపటి వ్యవస్థతో పోలిస్తే లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులలో దాదాపు 80% తగ్గుతుందని విద్యామంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో విద్య మరియు ఉన్నత విద్యా మంత్రి హెచ్ ఇ లోల్వా బింట్ రషీద్ అల్ ఖాటర్ స్పష్టం చేశారు.
ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్లు ఇప్పుడు ఏటా కాకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తమ లైసెన్స్లను పునరుద్ధరిస్తాయని తెలిపారు. దీంతోపాటు మంత్రిత్వ శాఖ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న విశిష్ట పాఠశాలలకు ఐదు సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే అధునాతన విద్యా లైసెన్స్ మంజూరు చేయబడుతుందన్నారు.
ఈ వ్యవస్థ ప్రైవేట్ విద్యా సంస్థల లైసెన్సింగ్ ప్లాట్ఫామ్ ద్వారా పనిచేస్తుందని, ఇది అన్ని లైసెన్సింగ్ విధానాలను ఒకే డిజిటల్ ఇంటర్ఫేస్లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అని వెల్లడించారు.
తాజా వార్తలు
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- ఒమాన్ లో స్టార్టప్లకు ప్రోత్సాహకాలు..!!
- బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ ప్లాట్ఫామ్ కు డిమాండ్..!!
- అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
- సరికొత్త LIC పాలసీ..బెనిఫిట్స్ అదుర్స్
- మరోదేశంపై దాడికి సిద్ధంగా ఉన్న ట్రంప్
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక







