కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- January 07, 2026
కువైట్: కువైట్ వెలుపల పనిచేస్తున్న అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్వర్క్లో ప్రమేయం ఉన్న ఇద్దరు భారతీయ ప్రవాసులకు క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. కైఫాన్ మరియు షువైఖ్ నివాస ప్రాంతాలలో రైడ్స్ సమయంలో అనుమానితులను డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో భద్రతా సిబ్బంది వారి వద్ద నుంచి సుమారు 14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫెటమైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మరియు మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల నుండి సమాజాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డ్రగ్ సంబంధిత నేరాలలో పాల్గొనే వారపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









