అబుదాబి కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ తోబుట్టువులు, పనిమనిషి మృతి..!!
- January 05, 2026
యూఏఈః అబుదాబిలో శనివారం ఉదయం జరిగిన ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ తోబుట్టువులు మరియు వారి పనిమనిషి మరణించారని యూఏఈకి చెందిన ఒక సామాజిక కార్యకర్త తెలిపారు. అబుదాబి-దుబాయ్ రోడ్డులోని షహామా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన కుటుంబ సభ్యులు రస్ అల్ ఖైమా నివాసితులు. రాజధానిలో జరిగిన సాంస్కృతిక ఉత్సవానికి హాజరైన తర్వాత తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో గాయపడ్డ తండ్రి మరియు తల్లి, వారి 14 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. వారు అబుదాబిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని సామాజిక కార్యకర్త చెప్పారు. ప్రమాదం జరిగిన అబుదాబిలోనే వారి మృతదేహాలను ఖననం చేయాలని వారి కుటుంబం తమ్మల్ని సంప్రదించిందని, కానీ దాని కోసం ప్రత్యేక అనుమతి అవసరం అని అన్నారు. యూఏఈలో మరణించిన వ్యక్తిని వారి నివాస వీసా జారీ చేయబడిన ఎమిరేట్లోనే ఖననం చేయాలి. అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు సామాజిక కార్యకర్త తెలిపారు.
తాజా వార్తలు
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- ఒమాన్ లో స్టార్టప్లకు ప్రోత్సాహకాలు..!!
- బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ ప్లాట్ఫామ్ కు డిమాండ్..!!
- అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
- సరికొత్త LIC పాలసీ..బెనిఫిట్స్ అదుర్స్
- మరోదేశంపై దాడికి సిద్ధంగా ఉన్న ట్రంప్
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక







