అబుదాబి కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ తోబుట్టువులు, పనిమనిషి మృతి..!!

- January 05, 2026 , by Maagulf
అబుదాబి కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ తోబుట్టువులు, పనిమనిషి మృతి..!!

యూఏఈః అబుదాబిలో శనివారం ఉదయం జరిగిన ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ తోబుట్టువులు మరియు వారి పనిమనిషి మరణించారని యూఏఈకి చెందిన ఒక సామాజిక కార్యకర్త తెలిపారు. అబుదాబి-దుబాయ్ రోడ్డులోని షహామా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన కుటుంబ సభ్యులు రస్ అల్ ఖైమా నివాసితులు. రాజధానిలో జరిగిన సాంస్కృతిక ఉత్సవానికి హాజరైన తర్వాత తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో గాయపడ్డ తండ్రి మరియు తల్లి, వారి 14 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. వారు అబుదాబిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని సామాజిక కార్యకర్త చెప్పారు.  ప్రమాదం జరిగిన అబుదాబిలోనే వారి మృతదేహాలను ఖననం చేయాలని వారి కుటుంబం తమ్మల్ని సంప్రదించిందని, కానీ దాని కోసం ప్రత్యేక అనుమతి అవసరం అని అన్నారు. యూఏఈలో మరణించిన వ్యక్తిని వారి నివాస వీసా జారీ చేయబడిన ఎమిరేట్‌లోనే ఖననం చేయాలి. అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు సామాజిక కార్యకర్త తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com