బహ్రెయిన్ లో యువత సామర్థ్యాలకు పదును..!!
- January 08, 2026
మనామా: బహ్రెయిన్ లో యువజన కేంద్రాలకు ప్రాధాన్యత కల్పించనున్నారు. యువతలోని ప్రతిభను, వారి సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో యువజన సాధికారత కేంద్రాలు కేంద్రంగా ఉన్నాయని నార్తెర్న్ గవర్నరేట్ గవర్నర్ హసన్ అబ్దుల్లా అల్ మదానీ అన్నారు. అబు సైబా యువజన సాధికారత కేంద్రం డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ సాదిక్ సల్మాన్ హబీబ్, పలువురు బోర్డు సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో యువజన కేంద్రాల స్థాపన, స్థానిక యువత అవసరాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే పిల్లలు, టీనేజర్లకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రాలు కార్యక్రమాలను డిజైన్ చేయాలని సూచించారు. యువతలోని ప్రతిభను పోషించడంలో మరియు వారి సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో యువజన సాధికారత కేంద్రాలు పోషిస్తున్న కీలక పాత్రను, చేపడుతున్న విశిష్ట ప్రయత్నాలను ఈ సందర్భంగా గవర్నర్ హసన్ అబ్దుల్లా అల్ మదానీ ప్రశంసించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







