దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- January 10, 2026
దోహా: భారతీయ దౌత్య కార్యాలయం, ఖతార్ ఆధ్వర్యంలో, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) సహకారంతో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం దోహాలోని ఐసీసీ అశోక హాల్లో జరిగింది.
ప్రవాస భారతీయులు దేశానికి, సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దివస్ను నిర్వహిస్తారు.ఈ ఏడాది వేడుకల్లో “నారి శక్తి–మహిళల శక్తి” అనే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.భారతీయ సమాజానికి విశేష సేవలందిస్తున్న మహిళా నాయకులను సత్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నారి శక్తి సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేశారు.నాయకత్వం, సేవాభావం, సమాజ అభివృద్ధికి చేసిన విశిష్ట కృషిని గుర్తించేలా ఈ పురస్కారాలు అందజేశారు.
ఖతార్లో భారతీయ సమాజానికి చేసిన సేవలకు గాను నందిని అబ్బగౌని కి నారి శక్తి సమ్మాన్ పురస్కారం అందజేయడం విశేషం.భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆమె పాత్ర ప్రశంసనీయమని, అలాగే భారత్–ఖతార్ మైత్రి బలోపేతానికి ఆమె చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తించారు.
ఈ కార్యక్రమానికి భారతీయ దౌత్య కార్యాలయ అధికారులు, వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుక, ప్రవాస భారతీయుల ఐక్యతను మరోసారి చాటిచెప్పింది.
ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు విజయవంతంగా ముగియగా, పురస్కార గ్రహీతలందరికీ భారతీయ దౌత్య కార్యాలయం హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







