దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- January 10, 2026
దోహా: భారతీయ దౌత్య కార్యాలయం, ఖతార్ ఆధ్వర్యంలో, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) సహకారంతో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం దోహాలోని ఐసీసీ అశోక హాల్లో జరిగింది.
ప్రవాస భారతీయులు దేశానికి, సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దివస్ను నిర్వహిస్తారు.ఈ ఏడాది వేడుకల్లో “నారి శక్తి–మహిళల శక్తి” అనే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.భారతీయ సమాజానికి విశేష సేవలందిస్తున్న మహిళా నాయకులను సత్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నారి శక్తి సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేశారు.నాయకత్వం, సేవాభావం, సమాజ అభివృద్ధికి చేసిన విశిష్ట కృషిని గుర్తించేలా ఈ పురస్కారాలు అందజేశారు.
ఖతార్లో భారతీయ సమాజానికి చేసిన సేవలకు గాను నందిని అబ్బగౌని కి నారి శక్తి సమ్మాన్ పురస్కారం అందజేయడం విశేషం.భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆమె పాత్ర ప్రశంసనీయమని, అలాగే భారత్–ఖతార్ మైత్రి బలోపేతానికి ఆమె చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తించారు.
ఈ కార్యక్రమానికి భారతీయ దౌత్య కార్యాలయ అధికారులు, వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుక, ప్రవాస భారతీయుల ఐక్యతను మరోసారి చాటిచెప్పింది.
ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు విజయవంతంగా ముగియగా, పురస్కార గ్రహీతలందరికీ భారతీయ దౌత్య కార్యాలయం హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







