హైదరాబాద్: కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి అలర్ట్..
- January 10, 2026
హైదరాబాద్: హైదరాబాద్ లో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి అలర్ట్. ఇకపై తమ నిర్మాణ సామగ్రిని ఇష్టానుసారం రోడ్లపై పడేసి సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో రహదారి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా.. పాదచారులు, వాహనదారుల భద్రతను కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టంలో కీలక సవరణలకు రంగం సిద్ధం చేసింది.నిర్మాణ సామగ్రిని రోడ్ల పై వేయడం, విక్రయించడంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ కఠినమైన జరిమానాలు, జైలు శిక్ష పడేలా కొత్త నిబంధనలను తీసుకురాబోతోంది. రేపోమాపో ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
హైదరాబాద్ నగర జీవనాన్ని సులభతరం చేసే లక్ష్యంతో జూలై 15, 2025న ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో ఈ సవరణలపై నిర్ణయాలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ చట్టంలోని వివిధ ఆర్టికల్స్ ప్రకారం రహదారులు, కాలిబాటలపై ఇసుక, ఇటుకలు, కంకర, మట్టి వంటి నిర్మాణ సామగ్రిని నిల్వ చేయడం లేదా అమ్మడం నేరంగా పరిగణించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారి పై ప్రభుత్వం భారీ జరిమానాలు విధించనుంది. నిర్మాణ వ్యర్థాలను అనుమతి లేకుండా తరలించే వాహనాలకు మొదటి తప్పిదంగా రూ.1 లక్ష జరిమానా విధిస్తారు. ఒకవేళ ఆ వ్యర్థాలను చెరువులు, నాలాలు, కాలిబాటలు లేదా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే జరిమానాను రెట్టింపు చేస్తారు. ఒకే వ్యక్తి లేదా సంస్థ రెండోసారి అంతకంటే ఎక్కువసార్లు ఇటువంటి తప్పులకు పాల్పడితే..జరిమానా మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచడంతో పాటు ఏడాది పాటు జైలు శిక్ష పడేలా చట్టంలో సవరణలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







