స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- January 11, 2026
హైదరాబాద్: స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్ (హైదరాబాద్ ఛాప్టర్) ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఆధ్యాత్మికత, సంస్కృతి, సేవా భావంతో ఉత్సాహంగా సాగాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి యువతరం కంకణబద్ధులుకావాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఈ సంకల్పాన్ని తీసుకోవాలని సూచించారు.
పురాతన భారతీయ ధర్మమైన “షేర్ అండ్ కేర్” సూత్రాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మనకు ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడం, ఇతరుల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం మన జీవన విధానంలో భాగం కావాలని తెలిపారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు తమ తమ గ్రామాల్లో సేవాలయాలను ఏర్పాటు చేయడంలో ముందుకు రావాలని, ఇప్పటికే కొనసాగుతున్న సేవా కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరారు.
పండుగ అంటే కొత్త బట్టలు, కొత్త ఆలోచనలే కాకుండా పాత అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకుని, భవిష్యత్తును నిర్ణయించుకుని ముందుకు సాగడమని వివరించారు. మన ఆనందాన్ని నలుగురితో పంచుకున్నప్పుడే నిజమైన ఆనందం లభిస్తుందన్నారు. పెద్దలకు గౌరవం ఇవ్వడం, కుటుంబ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవడం అవసరమని తెలిపారు.
అలాగే ప్రకృతిలోని ప్రతి జీవితో మన ఆనందాన్ని పంచుకోవాలని, ప్రకృతిని ప్రేమించి ప్రకృతితో కలిసి జీవించాలని (Love and live with nature) పిలుపునిచ్చారు. ప్రకృతి, సంస్కృతులు కలిసినప్పుడే మేలైన భవిష్యత్తు నిర్మాణం సాధ్యమని (Nature, Culture together for better future) పేర్కొన్నారు. పదిమందికి సాయం చేయాలనే భారతీయ సంస్కృతిని భావితరాలకు తెలియజేసే మార్గాలే మన పండుగలని, ముఖ్యంగా సంక్రాంతి అందించే విస్పష్టమైన సందేశం ఇదేనని వక్తలు అన్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







