ట్రంప్కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- January 16, 2026
అమెరికా: వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న విపక్ష నాయకురాలు, 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో.. గురువారం వైట్ హౌస్లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఆయనకు తన నోబెల్ బహుమతి పతకాన్ని బహూకరించారు.
మచాడో ఈ మెడల్ను అందజేస్తూ ఒక చారిత్రాత్మక కథను ప్రస్తావించారు. 1825లో అమెరికా విప్లవ వీరుడు మార్క్విస్ డి లాఫాయెట్, జార్జ్ వాషింగ్టన్ ముఖచిత్రం ఉన్న మెడల్ను వెనిజులా విముక్తి వీరుడు సైమన్ బోలివర్కు బహూకరించారు. ఇప్పుడు దానికి ప్రతిగా, బోలివర్ వారసులుగా.. వెనిజులా ప్రజలు వాషింగ్టన్ వారసుడైన ట్రంప్నకు ఈ నోబెల్ మెడల్ను అందజేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ తెగ సంబుర పడిపోయారు.
ఈ పరిణామంపై నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్ స్పందించింది. బహుమతి పతకాన్ని ఒకరి నుంచి మరొకరు తీసుకోవచ్చని, కానీ నోబెల్ గ్రహీత హోదాను మాత్రం బదిలీ చేయడం, పంచుకోవడం లేదా రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కాగా, “ఈ బహుమతి వెనెజువెలా ప్రజలది. దీనిని ట్రంప్తో పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం” అని మచాడో గతంలోనే వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







