విద్యాబాలన్ని సావిత్రి పాత్ర కోసం ఎంపిక ..
- July 28, 2016
తెలుగు తెరపై అలనాడు ఓ వెలుగు వెలిగిన మహానటి సావిత్రి. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువై తల్లిగా.. చెల్లిగా.. ఆత్మీయురాలిగా వారి గుండెల్లో నిలిచిపోయింది. అంత గొప్ప పేరు తెచ్చుకున్న మహానటి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను.. కష్టనష్టాలను చవిచూశారు. చివరకు విషాద పరిస్థితుల్లోనే తనువు చాలించారు.
అయితే ప్రస్తుతం ఆమె జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారట.బాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన విద్యాబాలన్ని ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని సమాచారం. సావిత్రిలాగే ఆమెకు కూడా తెలుగు.. తమిళం.. హిందీ.. వంటి పలుభాషల్లో ప్రావీణ్యం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.''సావిత్రి తర్వాత తెలుగు ఇండస్ట్రీల్లో ఎవ్వరూ మహానటి అని పిలిపించుకోలేకపోయారు. ఆమె జీవితకథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అందుకే ఆమె బయోపిక్ తీయాలనుకుంటున్నా'' అని చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









