విద్యాబాలన్‌ని సావిత్రి పాత్ర కోసం ఎంపిక ..

- July 28, 2016 , by Maagulf
విద్యాబాలన్‌ని సావిత్రి పాత్ర కోసం ఎంపిక ..

తెలుగు తెరపై అలనాడు ఓ వెలుగు వెలిగిన మహానటి సావిత్రి. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువై తల్లిగా.. చెల్లిగా.. ఆత్మీయురాలిగా వారి గుండెల్లో నిలిచిపోయింది. అంత గొప్ప పేరు తెచ్చుకున్న మహానటి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను.. కష్టనష్టాలను చవిచూశారు. చివరకు విషాద పరిస్థితుల్లోనే తనువు చాలించారు.
అయితే ప్రస్తుతం ఆమె జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారట.బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన విద్యాబాలన్‌ని ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని సమాచారం. సావిత్రిలాగే ఆమెకు కూడా తెలుగు.. తమిళం.. హిందీ.. వంటి పలుభాషల్లో ప్రావీణ్యం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.''సావిత్రి తర్వాత తెలుగు ఇండస్ట్రీల్లో ఎవ్వరూ మహానటి అని పిలిపించుకోలేకపోయారు. ఆమె జీవితకథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అందుకే ఆమె బయోపిక్‌ తీయాలనుకుంటున్నా'' అని చెప్పారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com