'వనం-మనం' కార్యక్రమం ఉద్యమంలా
- July 28, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలో 'వనం-మనం' కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. ఇవాళ ఒక్కరోజే కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు 'వనం- మనం' కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
* తూర్పుగోదావరిజిల్లా కాకినాడ తిలక్వీధిలో హోం మంత్రి చినరాజప్ప వనం-మనం కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. * విశాఖ కంభాలకొండ అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ ప్రవీణ్, అధికారులు పాల్గొన్నారు. * గుంటూరు జిల్లా పేరేచర్ల మండలం నల్లపాడు రిజర్వ్ ఫారెస్టులో 'వనం-మనం' కార్యక్రమాన్ని మంత్రి రావెల కిశోర్బాబు ప్రారంభించారు. జిల్లాల్లో 16.50 లక్షల మొక్కలు నాటేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేసింది. * తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు, మేయర్ రజనీశేషసాయి పాల్గొని మొక్కలు నాటారు. * విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో 'వనం-మనం' కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మొక్కల పెంపకంపై అవగాహన కోసం వేలమంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







