రోడ్డున పడేసిన మస్కట్ రోడ్డ్ ప్రమాదం
- July 29, 2016రోడ్డున పడేసిన మస్కట్ రోడ్డ్ ప్రమాదం. సహాయం కోసం కుటుంబీకుల ఎదురుచూపు. స్వదేశంలో పనులు సరిగ్గా దొరకక, పొట్ట చేతపట్టుకొని దూర దేశం వెళితే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో మింగేసింది. కుటుంబ సభ్యులకు కన్నీరే మిగిల్చింది. ఇది బతుకు జీవుడా అంటూ దూరదేశాల్లో పనులు చేసుకునే వారి దుస్థితి. తాజాగా నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం గుండారం గ్రామం ఎల్లాపూర్ తండాకు చెందిన గుగ్లోత్ దూల్యా (32) మస్కట్లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. బతుకు దెరువు కోసం లక్ష రూపాయలు అప్పుచేసి మస్కట్ దేశానికి వెళ్లాడని, అక్కడ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని చెప్పారు. కంపెనీవారు మూడునెలల జీతం ఇవ్వగా, మరో మూడునెలల జీతం ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఇంతలోనే రోడ్డు పనులు జరుగుతున్న సమయంలోనే ట్యాంకర్ బోల్తాపడి దూల్యా అక్కడికక్కడే మృతి చెందినట్టు వారన్నారు. అప్పుల పాలైన ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే ఆ కుటుంబం దిక్కులేని స్థితిలో ఉండాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే దూల్యా మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. మృతునికిభార్య లక్ష్మి, కుమారుడు సతీష్, కుమార్తెలు స్వాతి, సుజిత ఉన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..