2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- January 25, 2026
మస్కట్: గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాల జనాభా 2050 నాటికి 83.6 మిలియన్లకు చేరుకోనుంది. ఈ మేరకు గల్ఫ్ స్టాటిస్టికల్ సెంటర్ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. ఈ నివేదిక 2025 నుండి 2050 మధ్య కాలంలో జీసీసీ అంతటా జనాభా పెరుగుదల కొనసాగుతుందని, మొత్తం జనాభా గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. ఇక వృద్ధ జనాభా రెట్టింపు అయి 5.5 మిలియన్లకు పైగా చేరుకుంటుందని నివేదిక పేర్కొంది.
2024 చివరి నాటికి జీసీసీ మొత్తం జనాభా సుమారు 61.5 మిలియన్లుగా ఉంది. ఇది 2019తో పోలిస్తే 8.5 మిలియన్ల మంది పెరుగుదలను సూచిస్తుంది. సగటు వార్షిక జనాభా వృద్ధి రేటు 2.8 శాతానికి చేరుకుంది. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇది ఈ ప్రాంతంలో వేగవంతమైన జనాభా విస్తరణ అని పేర్కొంది.
ఇక వయసుల వారిగా చూస్తే..15–64 సంవత్సరాలు గల వారు మొత్తం జనాభాలో 76.7 శాతంగా ఉన్నారు. 0–14 సంవత్సరాల వారు 20.6 శాతంగా ఉండగా.. 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వృద్ధులు 2.6 శాతంగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. జనాభాలో పురుషులు 62.7 శాతంగా మరియు మహిళలు 37.3 శాతంగా ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







