2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- January 25, 2026
మస్కట్: గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాల జనాభా 2050 నాటికి 83.6 మిలియన్లకు చేరుకోనుంది. ఈ మేరకు గల్ఫ్ స్టాటిస్టికల్ సెంటర్ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. ఈ నివేదిక 2025 నుండి 2050 మధ్య కాలంలో జీసీసీ అంతటా జనాభా పెరుగుదల కొనసాగుతుందని, మొత్తం జనాభా గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. ఇక వృద్ధ జనాభా రెట్టింపు అయి 5.5 మిలియన్లకు పైగా చేరుకుంటుందని నివేదిక పేర్కొంది.
2024 చివరి నాటికి జీసీసీ మొత్తం జనాభా సుమారు 61.5 మిలియన్లుగా ఉంది. ఇది 2019తో పోలిస్తే 8.5 మిలియన్ల మంది పెరుగుదలను సూచిస్తుంది. సగటు వార్షిక జనాభా వృద్ధి రేటు 2.8 శాతానికి చేరుకుంది. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇది ఈ ప్రాంతంలో వేగవంతమైన జనాభా విస్తరణ అని పేర్కొంది.
ఇక వయసుల వారిగా చూస్తే..15–64 సంవత్సరాలు గల వారు మొత్తం జనాభాలో 76.7 శాతంగా ఉన్నారు. 0–14 సంవత్సరాల వారు 20.6 శాతంగా ఉండగా.. 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వృద్ధులు 2.6 శాతంగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. జనాభాలో పురుషులు 62.7 శాతంగా మరియు మహిళలు 37.3 శాతంగా ఉన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







