2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- January 25, 2026
మస్కట్: గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాల జనాభా 2050 నాటికి 83.6 మిలియన్లకు చేరుకోనుంది. ఈ మేరకు గల్ఫ్ స్టాటిస్టికల్ సెంటర్ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. ఈ నివేదిక 2025 నుండి 2050 మధ్య కాలంలో జీసీసీ అంతటా జనాభా పెరుగుదల కొనసాగుతుందని, మొత్తం జనాభా గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. ఇక వృద్ధ జనాభా రెట్టింపు అయి 5.5 మిలియన్లకు పైగా చేరుకుంటుందని నివేదిక పేర్కొంది.
2024 చివరి నాటికి జీసీసీ మొత్తం జనాభా సుమారు 61.5 మిలియన్లుగా ఉంది. ఇది 2019తో పోలిస్తే 8.5 మిలియన్ల మంది పెరుగుదలను సూచిస్తుంది. సగటు వార్షిక జనాభా వృద్ధి రేటు 2.8 శాతానికి చేరుకుంది. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇది ఈ ప్రాంతంలో వేగవంతమైన జనాభా విస్తరణ అని పేర్కొంది.
ఇక వయసుల వారిగా చూస్తే..15–64 సంవత్సరాలు గల వారు మొత్తం జనాభాలో 76.7 శాతంగా ఉన్నారు. 0–14 సంవత్సరాల వారు 20.6 శాతంగా ఉండగా.. 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వృద్ధులు 2.6 శాతంగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. జనాభాలో పురుషులు 62.7 శాతంగా మరియు మహిళలు 37.3 శాతంగా ఉన్నారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









