కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- January 25, 2026
కువైట్: లులు హైపర్ మార్కెట్ జనవరి 21 నుండి 27 వరకు కువైట్ లోని తన అవుట్లెట్లలో "ఇండియా ఉత్సవ్"తో భారత గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని జరుపుకుంది. ఈ ఉత్సవాలను జనవరి 22న అల్-రాయ్ లోని లులు హైపర్ మార్కెట్ లో కువైట్ లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా భారతీయ బ్రాండెడ్ ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపులు మరియు ప్రత్యేక ఆఫర్లను అందించారు.
ఈ వేడుకలో కువైట్లోని 15 కంటే ఎక్కువ భారతీయ పాఠశాలలు పాల్గొన్న ఇండియన్ ఎత్నిక్ వేర్ ఫ్యాషన్ షో మరియు ఇండియన్ పేట్రియాటిక్ గ్రూప్ సాంగ్ కాంపిటీషన్ కూడా ఉన్నాయి. విజేతలకు గిఫ్ట్ వోచర్లు మరియు ట్రోఫీలను అందించారు. లులు హైపర్ మార్కెట్ నిర్వహించిన “ఇండియా ఉత్సవ్” కువైట్లోని భారతీయ సమాజాన్ని విజయవంతంగా ఒకచోట చేర్చిందని.. భారతీయ వారసత్వం, సంస్కృతి మరియు సంప్రదాయాలను చాటిచెప్పిందని పేర్కొంది.
తాజా వార్తలు
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు







