కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- January 25, 2026
కువైట్: లులు హైపర్ మార్కెట్ జనవరి 21 నుండి 27 వరకు కువైట్ లోని తన అవుట్లెట్లలో "ఇండియా ఉత్సవ్"తో భారత గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని జరుపుకుంది. ఈ ఉత్సవాలను జనవరి 22న అల్-రాయ్ లోని లులు హైపర్ మార్కెట్ లో కువైట్ లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా భారతీయ బ్రాండెడ్ ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపులు మరియు ప్రత్యేక ఆఫర్లను అందించారు.
ఈ వేడుకలో కువైట్లోని 15 కంటే ఎక్కువ భారతీయ పాఠశాలలు పాల్గొన్న ఇండియన్ ఎత్నిక్ వేర్ ఫ్యాషన్ షో మరియు ఇండియన్ పేట్రియాటిక్ గ్రూప్ సాంగ్ కాంపిటీషన్ కూడా ఉన్నాయి. విజేతలకు గిఫ్ట్ వోచర్లు మరియు ట్రోఫీలను అందించారు. లులు హైపర్ మార్కెట్ నిర్వహించిన “ఇండియా ఉత్సవ్” కువైట్లోని భారతీయ సమాజాన్ని విజయవంతంగా ఒకచోట చేర్చిందని.. భారతీయ వారసత్వం, సంస్కృతి మరియు సంప్రదాయాలను చాటిచెప్పిందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







