అనురాగ్‌ ఠాకూర్‌ సరికొత్త బాధ్యతలు చేపట్టారు

- July 29, 2016 , by Maagulf
అనురాగ్‌ ఠాకూర్‌ సరికొత్త బాధ్యతలు చేపట్టారు

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సరికొత్త బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఆయన భారత సైన్యంలో చేరినట్లు తెలిపారు. అనురాగ్‌ ఠాకూర్‌ను లెఫ్టినెంట్‌గా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ దల్బీర్‌ ఎస్‌ సుగాగ్‌ నియమించారు. ఈ సందర్భంగా ఠాకూర్‌ మాట్లాడుతూ.. 'మా తాతయ్య ఆర్మీలో పనిచేశారు. చిన్నప్పటి నుంచి నేను కూడా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కనేవాడిని. ఇప్పుడు లెఫ్టినెంట్‌ హోదాలో నా దేశ ప్రజలకు సేవ చేస్తా' అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com