200 మంది మహిళల ఒంటరి ప్రయాణానికి అనుమతి

- July 29, 2016 , by Maagulf
200 మంది మహిళల ఒంటరి ప్రయాణానికి అనుమతి

200 మంది సౌదీ మహిళలకు న్యాయస్థానం ఒంటరిగా ప్రయాణం చేసేందుకు అనుమతినిచ్చింది. వీరిలో కొందరు చదువులకోసం, కొందరు వైద్య చికిత్స కోసం, ఇంకొందరు పర్యాటకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 350 మందికి పైగా సౌదీ మహిళలు ట్రావెల్‌ పర్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో కొందరిని న్యాయస్థానం తిరస్కరించింది. గార్డియన్స్‌, మాజీ భర్తల అభ్యంతరాలతో వారికి పర్మిషన్లు మంజూరు చేయలేదు న్యాయస్థానం. ఆర్టికల్‌ 8 ట్రావెల్‌ డాక్యుమెంట్స్‌ రెగ్యులేషన్స్‌ ప్రకారం, సౌదీ మహిళ, భర్త చనిపోయిన నేపథ్యంలో గార్డియన్‌తో పాటే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాగా, న్యాయస్థానం అనుమతించిన మహిళలకు సంబంధించి ప్రయాణానికి గల కారణాల్ని వెల్లడించాల్సిందిగా కోరింది. ఇంకో వైపు మినిస్ట్రీ, ఎలక్ట్రానిక్‌ మ్యారేజ్‌ కాంట్రాక్ట్స్‌ సిస్టమ్‌ని వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ విధానం ద్వారా నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ కో-ఆర్డినేషన్‌తో పనిచేస్తుంది. ఫింగర్‌ ప్రింట్స్‌ ఈ విధానం ద్వారా తీసుకోబడతాయి గనుక వివాదాలకు ఆస్కారం తక్కువగా ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com