200 మంది మహిళల ఒంటరి ప్రయాణానికి అనుమతి
- July 29, 2016
200 మంది సౌదీ మహిళలకు న్యాయస్థానం ఒంటరిగా ప్రయాణం చేసేందుకు అనుమతినిచ్చింది. వీరిలో కొందరు చదువులకోసం, కొందరు వైద్య చికిత్స కోసం, ఇంకొందరు పర్యాటకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 350 మందికి పైగా సౌదీ మహిళలు ట్రావెల్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో కొందరిని న్యాయస్థానం తిరస్కరించింది. గార్డియన్స్, మాజీ భర్తల అభ్యంతరాలతో వారికి పర్మిషన్లు మంజూరు చేయలేదు న్యాయస్థానం. ఆర్టికల్ 8 ట్రావెల్ డాక్యుమెంట్స్ రెగ్యులేషన్స్ ప్రకారం, సౌదీ మహిళ, భర్త చనిపోయిన నేపథ్యంలో గార్డియన్తో పాటే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాగా, న్యాయస్థానం అనుమతించిన మహిళలకు సంబంధించి ప్రయాణానికి గల కారణాల్ని వెల్లడించాల్సిందిగా కోరింది. ఇంకో వైపు మినిస్ట్రీ, ఎలక్ట్రానిక్ మ్యారేజ్ కాంట్రాక్ట్స్ సిస్టమ్ని వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ విధానం ద్వారా నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేషన్తో పనిచేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఈ విధానం ద్వారా తీసుకోబడతాయి గనుక వివాదాలకు ఆస్కారం తక్కువగా ఉంటుంది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









