200 మంది మహిళల ఒంటరి ప్రయాణానికి అనుమతి
- July 29, 2016
200 మంది సౌదీ మహిళలకు న్యాయస్థానం ఒంటరిగా ప్రయాణం చేసేందుకు అనుమతినిచ్చింది. వీరిలో కొందరు చదువులకోసం, కొందరు వైద్య చికిత్స కోసం, ఇంకొందరు పర్యాటకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 350 మందికి పైగా సౌదీ మహిళలు ట్రావెల్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో కొందరిని న్యాయస్థానం తిరస్కరించింది. గార్డియన్స్, మాజీ భర్తల అభ్యంతరాలతో వారికి పర్మిషన్లు మంజూరు చేయలేదు న్యాయస్థానం. ఆర్టికల్ 8 ట్రావెల్ డాక్యుమెంట్స్ రెగ్యులేషన్స్ ప్రకారం, సౌదీ మహిళ, భర్త చనిపోయిన నేపథ్యంలో గార్డియన్తో పాటే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాగా, న్యాయస్థానం అనుమతించిన మహిళలకు సంబంధించి ప్రయాణానికి గల కారణాల్ని వెల్లడించాల్సిందిగా కోరింది. ఇంకో వైపు మినిస్ట్రీ, ఎలక్ట్రానిక్ మ్యారేజ్ కాంట్రాక్ట్స్ సిస్టమ్ని వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ విధానం ద్వారా నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేషన్తో పనిచేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఈ విధానం ద్వారా తీసుకోబడతాయి గనుక వివాదాలకు ఆస్కారం తక్కువగా ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







