200 మంది మహిళల ఒంటరి ప్రయాణానికి అనుమతి
- July 29, 2016
200 మంది సౌదీ మహిళలకు న్యాయస్థానం ఒంటరిగా ప్రయాణం చేసేందుకు అనుమతినిచ్చింది. వీరిలో కొందరు చదువులకోసం, కొందరు వైద్య చికిత్స కోసం, ఇంకొందరు పర్యాటకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 350 మందికి పైగా సౌదీ మహిళలు ట్రావెల్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో కొందరిని న్యాయస్థానం తిరస్కరించింది. గార్డియన్స్, మాజీ భర్తల అభ్యంతరాలతో వారికి పర్మిషన్లు మంజూరు చేయలేదు న్యాయస్థానం. ఆర్టికల్ 8 ట్రావెల్ డాక్యుమెంట్స్ రెగ్యులేషన్స్ ప్రకారం, సౌదీ మహిళ, భర్త చనిపోయిన నేపథ్యంలో గార్డియన్తో పాటే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాగా, న్యాయస్థానం అనుమతించిన మహిళలకు సంబంధించి ప్రయాణానికి గల కారణాల్ని వెల్లడించాల్సిందిగా కోరింది. ఇంకో వైపు మినిస్ట్రీ, ఎలక్ట్రానిక్ మ్యారేజ్ కాంట్రాక్ట్స్ సిస్టమ్ని వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ విధానం ద్వారా నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేషన్తో పనిచేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఈ విధానం ద్వారా తీసుకోబడతాయి గనుక వివాదాలకు ఆస్కారం తక్కువగా ఉంటుంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







