ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- January 31, 2026
దోహా: ఇరాన్ అధ్యక్షుడు హెచ్ఈ డాక్టర్ మసూద్ పెజెష్కియన్తో ఖతార్ అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఫోన్ కాల్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేయడానికి గల మార్గాలను సమీక్షించారు. దీనితో పాటు తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిపై తమ ఆలోచనలను షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నాలపై చర్చించారు. ప్రాంతీయ సమస్యలను శాంతి మరియు భద్రతను పటిష్టం చేసే విధంగా, ప్రాంత ప్రయోజనాలకు తోడ్పడే రీతిలో దౌత్య ప్రయత్నాల ప్రాముఖ్యతను ఇరుపక్షాలు గుర్తించాయని, త్వరలోనే దీనిపై అధికారిక స్పందన వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









