కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!

- February 02, 2026 , by Maagulf
కార్మికులు  ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!

మనామా: బహ్రెయిన్‌లోని ప్రవాస కార్మికులు వారి ప్రస్తుత యజమాని నుండి అనుమతి లేకుండా కూడా ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన తర్వాత కొత్త యజమానికి బదిలీ చేసుకోవచ్చు అని ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేసింది. కాంట్రాక్టులు ఇప్పటికీ అమలులో ఉన్నప్పుడు కార్మికుల బదిలీలపై కఠినమైన నియంత్రణలు అవసరమని ఎంపీలు అత్యవసర ప్రతిపాదనను సమర్పించిన తర్వాత ఈ మేరకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకారం.. కార్మికులు తమ ప్రస్తుత యజమానికి మూడు నెలల నోటీసు విండోలోపు రిజిస్టర్డ్ లెటర్ ద్వారా తెలియజేయాలి.క్రిమినల్ నేరారోపణలు, వర్క్ పర్మిట్ నిబంధనల ఉల్లంఘన లేదా పర్మిట్ షరతులను పాటించకపోవడం వంటి కొన్ని సందర్భాల్లో బదిలీలను ఆపే వెసులుబాటు ఉంది. బదిలీ వారి ఒప్పంద లేదా చట్టపరమైన హక్కులకు హాని కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు యజమానులకు ఉంటుందని నిపుణులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com