కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- February 02, 2026
మనామా: బహ్రెయిన్లోని ప్రవాస కార్మికులు వారి ప్రస్తుత యజమాని నుండి అనుమతి లేకుండా కూడా ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన తర్వాత కొత్త యజమానికి బదిలీ చేసుకోవచ్చు అని ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేసింది. కాంట్రాక్టులు ఇప్పటికీ అమలులో ఉన్నప్పుడు కార్మికుల బదిలీలపై కఠినమైన నియంత్రణలు అవసరమని ఎంపీలు అత్యవసర ప్రతిపాదనను సమర్పించిన తర్వాత ఈ మేరకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకారం.. కార్మికులు తమ ప్రస్తుత యజమానికి మూడు నెలల నోటీసు విండోలోపు రిజిస్టర్డ్ లెటర్ ద్వారా తెలియజేయాలి.క్రిమినల్ నేరారోపణలు, వర్క్ పర్మిట్ నిబంధనల ఉల్లంఘన లేదా పర్మిట్ షరతులను పాటించకపోవడం వంటి కొన్ని సందర్భాల్లో బదిలీలను ఆపే వెసులుబాటు ఉంది. బదిలీ వారి ఒప్పంద లేదా చట్టపరమైన హక్కులకు హాని కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు యజమానులకు ఉంటుందని నిపుణులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







