బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- February 03, 2026
మనామా: బహ్రెయిన్ లో మరో కొత్త డిజిటల్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. సమాచార మరియు ఇ-గవర్నమెంట్ అథారిటీ సహకారంతో మునిసిపాలిటీలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ “బనాత్” సిస్టమ్ ద్వారా అడ్రస్ కార్డులను జారీ చేయడానికి కొత్త డిజిటల్ సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీస్ అడ్రస్ కార్డ్ ను జారీ చేసిన బిల్డింగ్ పర్మిట్కు లింక్ చేయనుంది.
కొత్త సిస్టమ్ ప్రాసెసింగ్ సమయాన్ని ఐదు రోజుల నుండి మూడు రోజులకు తగ్గిస్తుంది. ఆటోమేటిక్ డేటా వెరిఫికేషన్ను ప్రారంభించడానికి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ మరియు నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాప్స్తో సహా అనేక ప్రభుత్వ ప్లాట్ఫారమ్లతో అనుసంధానిస్తుంది. వినియోగదారులు ఎలక్ట్రానిక్ చెల్లింపును పూర్తి చేసిన వెంటనే అడ్రస్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. అనంతరం దానిని ప్రింట్ తీసుకోవచ్చు. ఈ సర్వీస్ అడ్రస్ కార్డ్ల జారీ, సవరణ మరియు తొలగింపును అనుమతిస్తుందని మునిసిపాలిటీలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో మున్సిపల్ వ్యవహారాల అండర్ సెక్రటరీ ఇంజనీర్ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా తెలిపారు. మున్సిపల్ మరియు ఇంజనీరింగ్ సేవలు, నిర్మాణం మరియు పట్టణ ప్రణాళిక రంగాలలో అధికారిక విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!









