10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- February 03, 2026
రాజంపేట: ఈనెల 10 తర్వాత మినహాయింపులు లేకుండా కార్యాచరణ అవసరాలను తీర్చడానికి తగినంత పైలట్లు, సిబ్బంది ఉంటారని ఇండిగో అధికారి కంగా డైరెక్టరేట్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)కి హామీ ఇచ్చింది. తాత్కాలిక సడలింపులు ముగిసిన తర్వాత కార్యాచరణ స్థిరత్వాన్ని కొనసాగించాలని ఆదేశించినట్లు పౌర విమాన “యాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మొహుల్ మురళీధర్ పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి ఇండిగో సంస్థ ఎదుర్కొంటున్న విమాన అంతరాయాలపై డైరెక్టరేట్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ తన విచారణను పూర్తి చేసిందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఏ మేరకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
అందుకు మంత్రి లిఖిత పూర్వక సమాధానంలో గత ఏడాది డిసెంబర్ 3, 5 మధ్య ఇండిగో చేసిన పెద్ద ఎత్తున జాప్యాలు, సర్వీసుల రద్దుల కారణంగా, 1937 ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ లోని 133తి నిబంధన కింద ఆదేశాలను పాటించనందుకు 22.20 కోట్ల ఒకేసారి ఆర్థిక జరిమానా విధించినట్టు తెలిపారు. దీర్ఘకాలిక దిద్దుబాటు చర్యలను నిర్ధారించడానికి డీజీసీఏ రూ.50 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని అందించాలని ఇండిగోను ఆదేశించామన్నారు. పరిహారం చెల్లింపు ప్రక్రియ కూడా జరిగినట్టు తెలిపారు. బాధిత ప్రయాణీకులకు వాపసు, పరిహార మొత్తాలను సకాలంలో చెల్లించడానికి వీలుగా ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్లు పనిచేస్తాయన్నారు.
విమాన రాకపోకలు, ప్రయాణీకుల డిమాండ్ పెరుగుదల నుండి ఉత్పన్నమయ్యే అవసరాలను తీర్చడానికి, గరిష్ట సమయాల్లో విమాన రాకపోకలను బలోపేతం చేయడానికి, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న విమానాశ్రయ మౌలిక సదుపాయాల విస్తరణ, మార్పు, అప్గ్రేడ్లు ఎప్పటికప్పుడు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో కొత్త టెర్మినళ్ల నిర్మాణం, ఉన్న టెర్మినళ్ల విస్తరణ, ఆధునీకరణ, రన్వేలు, ఆప్రాన్లను బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. భూమి లభ్యత, సాంకేతికఆర్థిక సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల లభ్యత, సమర్థ నియంత్రణ అధికారుల నుండి అవసరమైన అనుమతులు వంటి అంశాలకు లోబడి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో సహా సంబంధిత విమానాశ్రయ నిర్వాహకులు, డెవలపర్లు అభివృద్ధి పనులను చేపడతారు మంత్రి సమాధానమిచ్చారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









