కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- February 04, 2026
కువైట్: కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ ను ట్రాఫిక్ డిపార్టుమెంట్ ప్రారంభించనుంది. టాక్సీలు, డెలివరీ వాహనాలు, కార్లు మరియు ప్రజా రవాణా సేవలను పర్యవేక్షించడానికి ఏఐ సాంకేతికతల ఆధారంగా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు వేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఫర్ కోఆర్డినేషన్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ అల్-అద్వానీ ప్రకటించారు.
ట్రాఫిక్ భద్రతను బలోపేతం చేయడం మరియు కువైట్ విజన్ 2035కి అనుగుణంగా రవాణా మరియు స్మార్ట్ సేవల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ ఫోరమ్ లక్ష్యమని అల్-అద్వానీ వెల్లడించారు.
కొత్త వ్యవస్థ ట్రాఫిక్ ను పర్యవేక్షించడం, ఉల్లంఘనలను గుర్తించడం మరియు ఉల్లంఘనలు జరిగిన వెంటనే ఆటోమెటిక్ గా జరిమానాలు జారీ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇది ట్రాఫిక్ క్రమశిక్షణను పెంచుతుందని మరియు మొత్తం రహదారి భద్రతను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ







