బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- February 04, 2026
మనామా: బహ్రెయిన్ లో రమదాన్ మాసం నేపథ్యంలో ప్రజలకు మద్దతుగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీలు ప్రతిపాదించారు. ముఖ్యంగా డిజిటల్ ఫుడ్ వోచర్లు, షాప్ డిస్కౌంట్లు మరియు ఎంపిక చేసిన ప్రభుత్వ ఛార్జీలపై ఒక నెల విరామం ఇవ్వాలని కోరుతూ, తద్వారా లో మరియు మిడిల్ క్లాస్ కుటుంబాలకు రమదాన్ మద్దతును అందివ్వాలని పార్లమెంటులో అత్యవసర ప్రతిపాదనగా ఉంచారు. ఎంపీలు మునీర్ సెరూర్, హనన్ ఫర్దాన్, లుల్వా అల్ రుమైహి, నజీబ్ అల్ కవారీ మరియు అహ్మద్ సల్మాన్ అల్ అహ్మద్ ఈ ప్రతిపాదనను సమర్పించారు.
ఫుడ్, సామాజిక విధులు మరియు రోజువారీ అవసరాలపై ఖర్చు పెరుగుతున్నందున ప్రతి రమదాన్ లో ఇంటి బిల్లులు పెరుగుతాయని, జీతం అలాగే ఉంటుందని మరియు సాధారణ నెలవారీ చెల్లింపులు ఇప్పటికీ చెల్లించాల్సి ఉంటుందని ఎంపీలు వాదించారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ నెలలో ప్రధాన ఆహార షాపింగ్లో ఉపయోగించుకోవడానికి అవసరమైన వస్తువుల కోసం డిజిటల్ రంజాన్ వోచర్లను అందివ్వాలని కోరారు.
తాజా వార్తలు
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!









