ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- February 04, 2026
జపాన్: జపాన్ లోని అనేక ప్రాంతాల్లో భారీ హిమపాతం నిండిపోయింది. పలు ప్రాంతాలను హిమపాతం ముంచెత్తింది. గత రెండు వారాలుగా ఉత్తర జపాన్ లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ మంచు కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 300 మందికి పైగా గాయాలపాలయ్యారని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లోనైతే ఏకంగా 72 అంగుళాల మేర మంచు పేరుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. అతిశీతల వాతావరణం కారణంగా చలి తీవ్రత పెరిగి గుండెపోటు మరణాలు అధికసంఖ్యలో నమోదవుతున్నాయన్నాయని తెలిపారు.
ఈ విషయమై జపాన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి మాట్లాడుతూ.. భారీగా మంచు పేరుకుపోవడంతో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థతో పాటు ఇతర ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచును తొలగించడానికి టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించామన్నారు. ఇంత అధికంగా మంచు కురవడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారని.. రానున్న రోజుల్లో హిమపాతం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









